ఆ హీరో పాలిట ఐరెన్‌లెగ్‌గా రోజా..!!

N.ANJI
తెలుగు రాష్ట్రాలలో రోజా ఈ పేరు ఒక సంచలనంగా మారింది. ఆమె రెండున్నర దశాబ్దాల క్రిందట స్టార్ హీరోయిన్‌గా కొనసాగారు. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా తమిళ ఇండస్ట్రీలో కూడా తన సత్తా చాటారు. అయితే చిత్తూరు జిల్లా. రోజా 1990వ సంవత్సరంలోనే సూపర్ డూపర్ హిట్లతో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణించారు. ఈ తరణంలోనే రోజా.. బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్ లాంటి స్టార్ హీరోల పక్కన నటించి సూపర్ హిట్ సినిమాలను సొంతం చేసుకుంది.
అయితే ఆమె స్టార్ హీరోలకు అందరికీ రోజా సూపర్ డూపర్ హిట్లు ఇచ్చినా.. మరో సీనియర్ హీరో నాగార్జునకు మాత్రం ఆమె ఐరన్ లెగ్‌గా మారినట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. వీరిద్దరూ కలిసి జంటగా నటించిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అయితే 1993లో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై ఉప్పలపాటి నారాయణరావు దర్శకత్వంలో ‘రక్షణ’ సినిమా వచ్చింది. ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
ఈ చిత్రంలో సినిమాలో నాగార్జున - శోభన హీరో హీరోయిన్లుగా కలిసి నటించారు. ఈ సినిమాలో రోజా స్పెషల్ సాంగ్‌లో ఎంట్రీ ఇచ్చింది. అలాగే రక్షణ బాక్సాఫీస్ వద్ద కమర్షియల్‌గా సక్సెస్ కాలేదనే చెప్పాలి మరి. ఈ సినిమా తరువాత 1995లో ఎస్ వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో ‘వజ్రం’ సినిమా వచ్చింది. ఈ చిత్రంలో నాగార్జున, రోజా హీరో హీరోయిన్లుగా జతకట్టారు. అలాగే ఎస్ వి. కృష్ణారెడ్డి ‘కొబ్బరి బొండాం, మాయలోడు, రాజేంద్రుడు గజేంద్రుడు, నెంబర్ వన్, యమలీల’ వంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలతో టాప్ డైరెక్టర్ గా రాణిస్తున్నారు. ఇక అలాంటి దర్శకుడు ఎస్ వి.కృష్ణారెడ్డి తీసిన వజ్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయిన సంగతి అందరికి తెల్సిందే. అయితే అన్నీ సక్సెస్ హిట్‌లు అందించిన రోజా.. నాగార్జునకు ఏమాత్రం కలిసిరాలేదనే చెప్పాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: