అక్కినేని కోడలు ముంబై ఫ్లైట్ ఎక్కనుందా..?

NAGARJUNA NAKKA
సమంత ఇప్పటివరకు బాలీవుడ్‌ సినిమాలకు సంతకం పెట్టలేదు. దక్షిణాది సినిమాలతోనే బిజీగా ఉంది. కానీ బాలీవుడ్‌ స్టార్స్ మాత్రం ఈ హీరోయిన్‌తో సినిమాలు చేసేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవల బాలీవుడ్‌ హీరో సమంతతో సినిమా చేయాలనుందని చెప్పాడు. మరి ఈ క్రేజ్‌తో సమంత బాలీవుడ్‌లో బిజీ కాబోతుందా అనే ఉత్కంఠ ఆమె ఫ్యాన్స్ లో కొనసాగుతోంది.  
సమంతకు 'ఫ్యామిలీమెన్ 2' వెబ్‌ సీరీస్‌తో క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. నెగటివ్ షేడ్స్‌ ఉన్న క్యారెక్టర్‌ని సూపర్బ్‌గా ప్లే చేసిందని ప్రశంసలు వచ్చాయి. అప్పటి నుంచి సమంతకు బాలీవుడ్‌ నుంచి అవకాశాలు వస్తున్నాయని, ముంబయిలో అడుగు పెడుతుందనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు సమంత హిందీలో ఒక్క సినిమా కూడా ప్రకటించలేదు.  
బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ రీసెంట్‌గా తన అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యాడు. ఈ ఇంటరాక్షన్‌లో సమంత గురించి అడిగారు నెటిజన్లు. దీనికి సమంత గ్రేట్ పెర్ఫామర్ అని, ఈమెతో సినిమా చెయ్యాలనుందని చెప్పాడు షాహిద్‌. అప్పటినుంచి సామ్‌ బాలీవుడ్‌కి వెళ్తుందా హిందీలో సినిమాలు చేస్తుందా అనే మాటలు ఎక్కువయ్యాయి.
సమంత ఇటీవలే ఒక లేడీ ఓరియెంటెడ్‌ మూవీకి సైన్ చేసింది. శ్రీదేవి మూవీస్‌ బ్యానర్‌లో ఈ సినిమా తెరకెక్కబోతోంది. నవంబర్‌ నుంచి షూటింగ్‌ స్టార్ట్ కాబోతోంది. ఇక సమంత 'శాకుంతలం'తో పాన్‌ ఇండియన్‌ మార్కెట్‌లో అడుగుపెడుతోంది. గుణశేఖర్ దర్శకనిర్మాణంలో రూపొందిన ఈ సినిమా కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా తెరకెక్కుతోంది. చూడాలి మరి సమంత ఎలాంటి మాయ చేస్తుందో. సమంత అక్కినేని ఇంటి కోడలు అయినా కూడా తన జోరు సాగించడం ఆపలేదు. అంతకంతకూ తన టాలెంట్ చూపిస్తూనే ఉంది. పెళ్లయిన తర్వాత కూడా సినిమాలు చేస్తూ తన అభిమానుల్లో జోష్ పెంచుతోంది. రకరకాల ప్రోగ్రామ్స్ లో హోస్ట్ గా వ్యవహరిస్తూ ఫ్యాన్స్ లో ఆనందం నింపుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: