ఆ దర్శకుడు టాలీవుడ్ ను దత్తతు తీసుకున్నాడా.. ఆ సినిమా వరస ఏంటి?7pm

P.Nishanth Kumar
టాలీవుడ్ సినిమా పరిశ్రమలో వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ స్టార్ దర్శకుడిగా గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు ప్రశాంతి నీల్. ఆయన దర్శకత్వం వహించిన కే జి ఎఫ్ సినిమా మొదటి భాగం విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. రెండవ భాగం కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీ ప్రకటించనున్నారు చిత్రబృందం. ఈ సినిమా విడుదల కాకముందే ప్రశాంత్ టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో సలార్ అనే సినిమా చేస్తున్నాడు.

ఇప్పటికే 50 శాతం షూటింగ్ కూడా పూర్తి అయ్యిందని తెలుస్తోంది. రాజమౌళి తర్వాత పాన్ ఇండియా సినిమా లో తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు ప్రశాంత్ . ఈ నేపథ్యంలోనే ఆయన వరుసగా సినిమాలు చేస్తూ ఉండడం ఇప్పుడు టాలీవుడ్ ప్రేక్షకులను ఎంతగానో ఆనందమేస్తున్న మరో వైపు ఆశ్చర్యమేస్తుంది వారికి.

ప్రభాస్ తో సినిమా తర్వాత ప్రశాంత్ ఎన్టీఆర్ తో సినిమాను తెరకెక్కించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన కూడా వచ్చింది. మైత్రి మూవీ మేక ర్స్ వారికి ఇచ్చిన కమిట్ మెంట్ ప్రకారం గా ఎన్టీఆ ర్ తో ఈ సినిమా చేస్తున్నాడు ప్రశాంత్. ఆ తర్వాత అల్లు అర్జున్ తో పాన్ ఇండియా సినిమాకు కూడా ముహూర్తం పెట్టాడు.  గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కనుంది. దిల్ రాజు నిర్మాతగా ప్రభాస్ హీరోగా మరో సినిమా కూడా ప్రశాంత్ నీల్ కమిట్మెంట్ ఇచ్చుకున్నాడు. అంతే కాకుండా నిర్మాత డి.వి.వి.దానయ్య తో కూడా ఓ సినిమా చేస్తున్నాడు ఇందులో హీరో ఎవరనేది ఇంకా తెలియదు. ఇలా కన్నడ సినిమా పరిశ్రమ నుంచి దర్శకుడిగా వచ్చి టాలీవుడ్ లో పెద్ద సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు ప్రశాంత్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: