అనసూయ బర్త్ డే స్పెషల్..!
అనసూయకు సుశాంక్ భరధ్వాజ్ తో వివాహమయింది. వారికి ఇద్దరు పిల్లలు. సుశాంక్ ఫైనాన్సర్, ఇన్వెస్ట్మెంట్ ప్లానర్. టెలివిజన్ లో వార్తా వ్యాఖ్యాతగా పనిచేసిన తరువాత ఆమె జబర్దస్త్ షో లో యాంకర్ గా మారింది. ఆ షో అనసూయ జీవితాన్ని ఉన్నత స్థితికి తీసుకొని వచ్చింది. తరువాత ఆమెకు సోగ్గాడే చిన్నినాయనా చిత్రంలో అక్కినేని నాగార్జున తో కలసి నటించే అవకాశం వచ్చింది. తరువాత అదే సంవత్సరం క్షణం సినిమాలో ఒక ప్రధాన పాత్రలో నటించింది. రంగస్థలంలో రంగమ్మత్తగా నటించింది. ప్రస్తుతం ‘ఖిలాడి’, ‘రంగమార్తాండ’ సినిమాల్లో నటిస్తోంది. తమిళంలో కూడా ఓ సినిమా చేస్తోంది. మలయాళంలో మమ్ముట్టి సినిమాలో కీలకపాత్ర పోషిస్తోంది. రెండు వెబ్సిరీస్లూ చేస్తూ బిజీగా ఉంటోంది. టెలివిజన్ వ్యాఖ్యాతగా ఆమె అనేక పురస్కారాలను పొందింది. వాటిలో జీ కుటుంబం అవార్డులు, స్టార్ పరివార్ అవార్డులు ముఖ్యమైనవి. ఆమె మూడుసార్లు జీ తెలుగు లో "ఒకరికొకరు" అవార్డులను నిర్వహించింది. ఆమె దుబాయిలో అప్సర అవార్డులు ఫంక్షన్, గామా అవార్డులలో ప్రదర్శననిచ్చింది. దేవి శ్రీ ప్రసాద్ యు.ఎస్ కచేరీలలో భాగంగా నిర్వహణలో పాల్గొంది.