ఎడమచేతిని చూపించకుండా చివరి వరకు నటించింది..!!

Mamatha Reddy
హిందీ చలన చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్ లు మెరిశారు.. తమదైన టైంలో  వరుస సినిమాలు చేస్తూ బిజీగా రెండు చేతులా సంపాదించుకున్నారు.. అలా హిందీ పరిశ్రమను ఒక ఊపు ఊపేసిన నటీమణి మీనా కుమారి.. అభినయం, అందం కలగలిపిన ఈ నటికి మరెవరు సాటిరాని విధంగా ఆమె అందం ఉండేది.. అప్పట్లో బాలీవుడ్ టాప్ నటులు నర్గీస్,  నిమ్మి  సుచిత్రాసేన్ కూడా మీ నటనకు ఫిదా అయ్యేవారు..ఇంత గొప్ప నటిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మీనా కుమారి తన చివరి సినిమా వరకు ఎడమచేతిని చూపించకుండానే సినిమాలు చేసింది .. అందుకు కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ఓ ముస్లిం కుటుంబంలో జన్మించిన మీనాకుమారి అసలు పేరు మెహజబిన్ బేగం.. ఆమె తండ్రి థియేటర్ ఆర్టిస్ట్.. తల్లి కూడా సినిమా నటి.. ఈ కారణం చేతనే మీనా కుమారి సినిమా రంగం వైపు అడుగులు వేసింది.  ఓసారి భర్తతో కారులో వెళ్తుండగా యాక్సిడెంట్ అయ్యింది మీనాకుమారికి..  తీవ్రగాయాలైన ప్రాణాలతో బయట పడింది మీనా.. ఈ ప్రమాదంలో ఆమె ఎడమ చేయి పూర్తిగా చిధ్రం అయింది.. డాక్టర్లు ఎంత ప్రయత్నం చేసినా అది సెట్ అవ్వలేదు.. చెయ్యి రూపం మొత్తం కోల్పోయింది.. దాంతో తన ఎడమచేతిని సినిమాల్లో కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంది..
చీర లేదంటే దుపట్టాతో లేదంటే మరోరకంగా హ్యాండ్ పడకుండా చూసుకునేది.. దర్శకులు కూడా అందుకు ఏమాత్రం ఆబ్జెక్షన్ చెప్పేవారు కాదు.. ఇక ఆమె పేరు మార్చుకోవడానికి కారణం బైజు బావ్ర అనే సినిమా..ఆ సినిమా తర్వాత ఆమెకు మంచి ఆఫర్లు రావడంతో నటిగా ఎదిగింది.. సినిమాల్లో నటించినంత కాలం మీనా కుమారి జీవితం చాలా సంతోషంగా గడిచింది.. కానీ తన మరణానికి ముందు ఆమె తీవ్రమైన పేదరికాన్ని అనుభవించింది.. ఎంతలా అంటే తన అనారోగ్యానికి ఆసుపత్రిలో వైద్యం చేయించుకునేందుకు చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు.. ఆ విషయం తెలియడంతో తన అభిమాని అయిన ఓ డాక్టరు ఆమె వైద్య ఖర్చులను తనే భరించాడు.. జీవిత చరమాంకంలో తను ఒంటరి జీవితాన్ని గడిపింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: