రానా నేను స్కూల్ మేట్స్.. అసలు విషయం చెప్పేసిన నవీన్ పోలిశెట్టి..?

praveen
ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎక్కడ చూసినా కూడా ఆ హీరో పేరే వినిపిస్తుంది. ఆ హీరో పేరు తెరమీదికి వచ్చింది అంటే చాలు అందరి ముఖాల్లో కూడా నవ్వులు విరబూస్తాయి.   ఇటీవలే విడుదలైన తన సినిమాతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు యువ హీరో. ఆ హీరో ఎవరో కాదు నవీన్ పొలిశెట్టి. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమకు పరిచయమైన నవీన్ పొలిశెట్టి మొదట ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు.

 ఇక ఇటీవల ఫుల్ కామెడీ సినిమాల జాతిరత్నాలు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు నవీన్ పోలిశెట్టి. ఇక భారీ వసూళ్లను కూడా రాబట్టాడు. టాలీవుడ్ లో  ఎక్కడ చూసినా కూడా నవీన్ పోలిశెట్టి పేరు మార్మోగిపోతోంది. నవీన్ పొలిశెట్టి కేవలం సినిమాల్లో మాత్రమే కాదు అటు నిజజీవితంలో కూడా ఎంతో సరదాగా  నవ్వుతూ నవ్విస్తూ ఉంటాడు. అంతేకాదు స్పాంటేనియస్ గా పంచులు వేస్తూ ఉంటాడు నవీన్ పొలిశెట్టి. కాగా ఇటీవలే నవీన్ పొలిశెట్టి తన జాతి రత్నాలు టీంతో కలిసి రానా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నెంబర్ వన్ యారి అనే కార్యక్రమంలో పాల్గొన్నారు.

 ఈ క్రమంలోనే ఇక జాతిరత్నాలు ముగ్గురుతో స్పెషల్ వీడియోస్ చేయించి ఈ షో లో ప్లే చేయించారు. అయితే జాతి రత్నాలు సినిమాలో హీరో నేనే అని మిగతా అందరూ కూడా సైడ్ క్యారెక్టర్లు అంటూ చెబుతారు నవీన్ పోలిశెట్టి.  అంతేకాకుండా రానా తాను స్కూల్ మేట్స్ అని..  ఇద్దరం ఎన్నో రోజుల పాటు చదువుకున్నామని..  అంతేకాకుండా రానాకు ఎన్నో ఆఫర్లు కూడా తన వల్లే వచ్చాయని అంతే కాదు బాహుబలి సినిమాలో ఆఫర్ కూడా తన వల్లే వచ్చింది నవీన్ పోలిశెట్టి చెప్పుకొచ్చాడు.  ఇక ఆ తర్వాత స్పందించిన రానా నువ్వు నేను ఒకే స్కూల్లో చదువుకున్నామా ఎక్కడ అంటూ అడుగుతాడు.. జోగిపేటలో అనే నవీన్ పోలిశెట్టి చెబితే నేను బేగంపేట్ లో చదువుకున్నాను అంటూ రానా చెబుతాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: