షారుఖ్ కోసం...సల్మాన్ ఖాన్ చేస్తున్న పని తెలిస్తే షాక్ అవుతారు...?

VAMSI
కొన్ని సినిమాలలో అతిధి పాత్రలు ఎంతో కీలకమవుతాయి... అలాంటప్పుడు ఆ స్పెషల్ రోల్స్ చేసే స్టార్స్ భారీ మొత్తంలోనే పారితోషికాన్ని డిమాండ్ చేస్తూ ఉంటారు.... వారు ఆ పాత్రలు చేయడం సినిమాలో ఎంతో కీలకం కావడం చేత నిర్మాతలు సైతం వారు అడిగినంత ముట్ట చెబుతుంటారు. కానీ కొందరు తారలు మాత్రం స్నేహితుల సినిమాలలో అతిధి పాత్రలు చేసేటప్పుడు... పారితోషకాన్ని ఆశించరు. తమ మిత్రుల కోసం చేసే ఒక చిన్న సాయంగా భావిస్తారు. అందుకనే ఎటువంటి రెమ్యూనరేషన్ తీసుకోకుండా సదరు చిత్రాలలో నటిస్తుంటారు. ఇదే తరహాలో మెగాస్టార్ మూవీ సైరా నరసింహారెడ్డి చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ ఓ కీలక పాత్రలో కనిపించారు.
ఇందుకు ఆయన ఎటువంటి పారితోషికం తీసుకోలేదట. అప్పట్లో ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఆయన  వద్దన్నప్పటికీ ఆ సినిమా నిర్మాత రామ్ చరణ్ తేజ్ పారితోషకం తీసుకోవాలని బిగ్ బీ ని కోరారని. తన ఆప్తుడు మెగాస్టార్ చిత్రంలో నటించినందుకు సుంకాన్ని తీసుకోలేనని ఖచ్చితంగా చెప్పేశాడట. ఇప్పుడు బాలీవుడ్ బడా స్నేహితుల విషయంలోనూ ఇదే జరిగింది. హిందీలో షారుక్ ఖాన్ తాజా చిత్రం పఠాన్. నిర్మాత ఆదిత్య చోప్రా ఈ చిత్రానికి నిర్మాత గా వ్యవహరించారు. కాగా ఈ సినిమాలో సల్మాన్ ఓ ప్రత్యేక పాత్రను పోషించారు. అయితే ... పఠాన్లో సల్మాన్ ఖాన్ తన అతిధి పాత్ర కోసం డబ్బు తీసుకోవడానికి నిరాకరించారు. పఠాన్  సినిమాలో అతిధి పాత్ర చేసిన సల్మాన్ ఖాన్... అందుకోసం పది రోజుల  డేట్స్ ఇచ్చారు.
ఫిబ్రవరిలో సల్మాన్ ఖాన్ ముంబైలోని వైఆర్ఎఫ్ స్టూడియోలో షారూఖ్ ఖాన్ తో కలిసి తన పార్ట్ షూటింగ్ ను  కంప్లీట్ చేశారు సల్మాన్. ఇందులో సల్మాన్ పాత్ర సినిమాకు ఎంతో ప్రత్యేకం. అయితే సల్మాన్ కు ఈ సినిమాకి సంబంధించి అతిధి పాత్ర కోసం పారితోషికం చెల్లించేందుకు  గాను సల్మాన్ ని కలిసారట పఠాన్ చిత్ర నిర్మాత. కానీ అందుకు సల్మాన్ ఏ మాత్రం అంగీకరించలేదు. షారూఖ్ నా  సోదరుడిలాంటివాడు. నేను అతని కోసం ఏదైనా చేస్తాను!! అందుకు ప్రతిఫలం ఆశించలేనని   సల్మాన్ అన్నారట. కానీ నిర్మాత ఆదిత్యా చోప్రా ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అని ఒత్తిడి చేయడం తో ...ఆ మొత్తాన్ని యష్ రాజ్ సంస్థ నిర్మించే టైగర్ బడ్జెట్ లో చేర్చాల్సిందిగా చెప్పారు. ఇలా మన తారలు తమ అభిమాన మిత్రులపై ఉన్న అభిమానాన్ని చాటుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: