అనసూయ బుల్లితెరకు దూరమవుతోందా..?

Deekshitha Reddy
దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవడం ఈ తరం నటీమణులకు బాగా తెలుసు. క్రేజ్ ఉండగానే దాన్ని క్యాష్ చేసుకునే ఉద్దేశంతో.. న్యూస్ రీడర్ గా ఉన్న అనసూయ క్రేజీ యాంకర్ గా అవతారమెత్తారు. ఆ తర్వాత బుల్లితెర ప్రేక్షకుల హృదయాలను పూర్తిగా దోచుకున్నారు. స్టేజ్ షోలతో కూడా మంచి పేరు సంపాదించారు. ఇటీవల పూర్తిగా సినీ ఇండస్ట్రీపై కన్నేశారు రంగమ్మత్త. రంగస్థలం మూవీ ఆమె కెరీర్ ని పూర్తిగా మార్చేసిందని చెప్పాలి. నటనకు స్కోప్ ఉన్న పాత్రలో నటించి తనని తాను ప్రూవ్ చేసుకున్న అనసూయ.. సినిమాలపై ఫోకస్ పెంచారు.
ఇటీవల ‘పైన పటారం.. లోన లోటారం’ అనే పాటతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన అనసూయ.. మరోసారి స్పెషల్ సాంగ్ కోసం రెడీ అవుతున్నారట. కార్తికేయ హీరోగా వచ్చిన ‘చావుకబురు చల్లగా’ సినిమాలో అనసూయ పాట సినిమాకే స్పషల్ అట్రాక్షన్ కావడంతో.. అదే దారిలో మరికొన్ని అవకాశాలు ఆమెకు వస్తున్నాయి. ఐటంసాంగ్స్ చేయను అని గతంలో గిరిగీసుకున్నా.. వచ్చిన అవకాశాలను వదిలిపెట్టకూడదనే ఉద్దేశంతో ఆమె ఈ ఆఫర్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. అయితే కథాబలం, మంచి బ్యానర్లను మాత్రమే ఆచితూచి ఎంపిక చేసుకుంటోంది అనసూయ.
శర్వానంద్‌, సిద్దార్థ్‌ హీరోలుగా నటిస్తున్న ‘మహాసముద్రం’ సినిమాలో అనసూయ స్పెషల్‌ సాంగ్‌ చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా యూనిట్ అనసూయతో స్పెషల్ సాంగ్ విషయమై చర్చలు జరిపిందట. అజయ్‌ భూపతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లు. ఏకే ఎంటర్‌ టైన్ ‌మెంట్స్‌ బ్యానర్లో అనిల్ సుంకర ఈ సినిమా నిర్మిస్తున్నారు. అనసూయ కూడా సినిమాకు యాడ్ కావడంతో మరింత స్పెషల్ అట్రాక్షన్ వచ్చినట్టయింది.
వరుస సినిమా అవకాశాలతో అనసూయ బుల్లితెరకు దూరమవుతుందని కూడా వార్తలొస్తున్నాయి. స్పెషల్ సాంగ్ లతోపాటు, స్పెషల్ క్యారెక్టర్స్ కూడా వర్కవుట్ అయితే అనసూయ కాల్షీట్లు ఖాళీగా ఉండవు. అదే జరిగితే.. ఆమే ప్రత్యేక ఆకర్షణగా ఉన్న కొన్ని టీవీ కార్యక్రమాలకు ఇబ్బంది రావడం ఖాయం. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: