బాలీవుడ్ ఫ్లైట్ ఎక్కేస్తున్న మన బ్యూటీలు..!

NAGARJUNA NAKKA
టాలీవుడ్‌ యంగ్‌ బ్యూటీస్‌కి బంపర్ ఆఫర్ తగిలింది. కరోనాతో ప్రపంచమంతా భయపడుతుంటే, వీళ్లకి మాత్రం గోల్డెన్‌ అవకాశం  దొరికింది. ఇన్నాళ్లు ఇద్దరు కన్నడమ్మాయిలు అడ్డుగా ఉన్నారని బాధపడుతోన్న హీరోయిన్లకు, ఆ అడ్డంకి తొలిగిపోతోంది. మరి అనుకోకుండా వచ్చిన ఈ వ్యాక్యూమ్‌ని యంగ్‌ బేబీస్‌ ఎలా క్యాష్‌ చేసుకోబోతున్నారు.
అనుష్క సీనియర్ హీరోయిన్ కేటగిరీలో చేరిపోయింది. కాజల్‌, సమంత పెళ్లిళ్లు చేసుకొని మెచ్యూర్డ్ క్యారెక్టర్స్‌ కావాలి అంటున్నారు. దీంతో కమర్షియల్‌ హీరోయిన్ రోల్స్‌కి పూజా హెగ్డే, రష్మిక మందన్న ఇద్దరూ ఫస్ట్ ఛాయిస్‌లా మారిపోయారు. మహేశ్ బాబు, ప్రభాస్ నుంచి జూ.ఎన్టీఆర్, అల్లు అర్జున్ వరకు అందరూ ఈ హీరోయిన్లతోనే సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు వీళ్లు టాలీవుడ్‌ని పక్కనపెట్టి బాలీవుడ్‌కి వెళ్లిపోతున్నారు.
పూజా హెగ్డే 'అరవింద సమేత, మహర్షి, అల వైకుంఠపురములో' హిట్స్‌తో స్టార్‌ హీరోయిన్‌గా మారిపోయింది. వరుస హిట్స్‌లో ఉందని, టాప్ హీరోలు కూడా పూజానే ప్రిఫర్ చేస్తున్నారు. అయితే ఈ హీరోయిన్ మాత్రం బాలీవుడ్‌లో వరుస సినిమాలకి కమిట్‌ అవుతోంది. రణ్‌వీర్‌ సింగ్‌తో 'సర్కస్', సల్మాన్ ఖాన్‌తో 'ఖబీ ఈద్ ఖబీ దివాళి' సినిమాలు చేస్తోంది. దీంతో తెలుగు మూవీస్‌కి దూరమవుతోంది పూజ.
పూజా హెగ్డే వెళ్లిపోయినా రష్మిక ఉందనుకుంటోన్న మేకర్స్‌కి, హీరోలకి ఈమె కూడా షాక్‌ ఇచ్చింది. ఇన్నాళ్లు సౌత్‌ సినిమాలతోనే సందడి చేసిన రష్మిక ఇప్పుడు బాలీవుడ్‌కి వెళ్తోంది. సిద్దార్థ్ మళ్హోత్రా 'మిషన్ మజ్ను' సినిమాలో రష్మిక హీరోయిన్‌గా చేయబోతోంది.
పూజా హెగ్డే, రష్మిక మందన్న తర్వాత స్టార్‌ హీరోలకి బెస్ట్ ఆప్షన్‌గా కనిపిస్తోన్న హీరోయిన్ కీర్తీ సురేశ్. 'మహానటి'తో నేషనల్‌ అవార్డ్‌ అందుకున్న కీర్తీ, ఈ మధ్యనే స్టార్‌ హీరోలతో సినిమాలు చేస్తోంది. మహేశ్ బాబుతో 'సర్కారు వారి పాట'లో సందడి చేస్తోంది కీర్తీ. అయితే కీర్తీ స్కిన్‌ షో ఉండే కమర్షియల్‌ క్యారెక్టర్స్‌కి సెట్ అవ్వదనే కామెంట్స్‌ ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: