ఒకే సమయంలో పుట్టి, ఒకేలా ఉండే టాలీవుడ్ కవలలు ఎవరో తెలుసా..?

Mamatha Reddy
సినిమాల్లో డబుల్ యాక్షన్ చేయాలంటే చాలా కష్టం. రెండు పాత్రలు కూడా ఒకేలా ఉండేలా చూసుకోవడం దర్శకులకు చాలా ఇబ్బంది. సాంకేతిక వర్గం కూడా డబుల్ యాక్షన్ సినిమాల కోసం రెట్టింపు పని చేయాల్సి ఉంటుంది. కొన్ని తప్పులు దొర్లినా సినిమా మొత్తం అట్టర్ ఫ్లాప్ కావడం ఖాయం. అందుకే హీరో హీరోయిన్లు డబుల్ యాక్షన్ చేయడానికి వెనుకడుగు వేస్తుంటారు. డ్యూయల్ రోల్లో చేయడం అంటే కష్టమే మరి. అయితే సినిమాల్లో డ్యూయల్ రోల్స్ ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తాయని చెప్పుకోవచ్చు. అయితే కొందరు వెండితెరపై డబుల్ యాక్షన్ చూపించి ఫిదా చేస్తే మరికొందరు నటీనటులు నిజజీవితంలో కూడా డబుల్ యాక్షన్ లో కనిపించి మంత్రముగ్ధుల్ని చేస్తుంటారు. ఆ లిస్టులో కి సాయి పల్లవి కూడా చేరింది.
వరుణ్ తేజ సరసన ఫిదా సినిమాలో నటించిన సాయి పల్లవి తన తెలంగాణ యాసతో అదరగొట్టేసి ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ గా మారింది. ఆమె తెలుగులోనే కాదు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటిస్తూ అగ్రతారగా ఎదుగుతోంది.
ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి తనకు ఓ చెల్లి ఉందని, ఆమె తాను కవల పిల్లలమని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. తమ తల్లి సత్యసాయి భక్తురాలు కావడంతో తమ పేర్ల ముందు సాయి వచ్చేలా నామకరణం చేసిందని ఆమె చెప్పుకొచ్చింది.
ఇకపోతే సాయిపల్లవి చెల్లెలు పేరు పూజా పల్లవి కాగా.. ఆమె మలయాళ సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ప్రముఖ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ కూడా కవల పిల్లలే. వీళ్ళిద్దరు అలీతో సరదాగా టాక్ షో లో పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచారు. టాలీవుడ్ లో ఫైట్ మాస్టర్స్ గా మెగాస్టార్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలకు స్టైలిష్ గా ఫైట్స్ కంపోజ్ చేసి బెస్ట్ ఫైట్ మాస్టర్ గా రామలక్ష్మణ్ కీర్తి ప్రతిష్టలు తెచ్చుకున్నారు. ఫైట్ కొరియోగ్రాఫర్స్ మాత్రమే కాదు రౌడీలుగా కూడా నటిస్తుంటారు. వీళ్ళు కవలలను పెళ్లి చేసుకున్నారు. డైరెక్టర్స్ ధర్మ , రక్ష కూడా కవల పిల్లలే. ప్రముఖ టాలీవుడ్ దర్శకుల వద్ద అసిసిస్టెంట్స్ గా పనిచేసిన ధర్మ, రక్ష చందమామ రావే సినిమాకు దర్శకత్వం వహించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: