ఆ సినిమా మొత్తం నాచురల్ గానే.. కనీసం మేకప్ కూడా లేకుండా..!

shami
సంపత్ నంది కథతో అశోక్ తేజ డైరక్షన్ లో వస్తున్న సినిమా ఓదెల రైల్వేస్టేషన్ ఈ సినిమాను శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ లో కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను పూర్తిగా కొత్త పద్ధతిలో తెరకెక్కిస్తున్నారట. సినిమాలో కాస్టింగ్ ఎవరికి మేకప్ లేకుండా.. డిఫరెంట్ కాస్టూంస్ లేకుండా తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. అంతేకాదు సినిమాకు రెయిన్ ఎఫెక్ట్ కావాలని అడిగితే ప్రకృతి వర్షం కురిపించిందని.. సినిమాని ప్రకృతి ఆశీర్వదించిందని అన్నారు నిర్మాత రాధా మోహన్.
క్రైం థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హెబ్భా పటేల్, పూజిత పొన్నాడ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కన్నడ స్టార్ సింహా మేల్ లీడ్ గా నటిస్తున్నాడు. ఈ సినిమాను సంపత్ నంది మంచి కథ రాసినట్టు తెలుస్తుంది. సినిమా నాచురల్ గా షూట్ చేయడం.. ప్రకృతి కూడా తన సపోర్ట్ అందిస్తుండటం సినిమాకు అంతా ప్లస్ అవుతుందని తెలుస్తుంది.  
చిన్న సినిమాల్లో రాధామోహన్ తన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే నాగ చైతన్య లవ్ స్టోరీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా నిర్మాతగా రాధామోహన్ కథకు తగిన బడ్జెట్ కేటాయిస్తున్నట్టు తెలుస్తుంది. లవ్ స్టోరీతో పాటుగా ఓదెల రైల్వేస్టేషన్ కూడా రాధామోహన్ నిర్మాణంలో వస్తుంది. లవ్ స్టోరీ నాగ చైతన్య, సాయి పల్లవి లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు.                                                                                   

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: