ఓదెల రైల్వే స్టేషన్.. సంపత్ నంది పోస్టర్ అదిరిందబ్బా..!

shami
కొందరు తాము డైరక్టర్ గా చేస్తూనే మరికొందరికి డైరక్టర్ అయ్యే ఛాన్స్ ఇస్తుంటారు. అలాంటి వారిలో సంపత్ నంది ఒకరు. డైరక్టర్ గానే కాదు నిర్మాతగా కూడా సంపత్ నంది తన టేస్ట్ ఏంటో చూపిస్తున్నారు. రీసెంట్ గా బ్లాక్ రోజ్ అంటూ ఓ మూవీ ప్రొడ్యూస్ చేస్తూ సర్ ప్రైజ్ చేసిన సంపత్ నంది కొత్తగా ఓదెల రైల్వేస్టేషన్ అంటూ మరో సినిమా ఎనౌన్స్ చేశారు. ఈ సినిమాను అశోక్ తేజ డైరెక్ట్ చేస్తారని తెలుస్తుంది. సినిమాకు నిర్మాతలుగా సంపత్ నంది, కెకె రాధామోహన్ ఉంటున్నారు.     
ఇక ఈ సినిమా ఎనౌన్స్ చేయడమే టైటిల్ పోస్టర్ తో వచ్చారు చిత్రయూనిట్. ఓదెల రైల్వేస్టేషన్ అంటూ రక్తపు మరకలతో టైటిల్ క్రేజీగా ఉండగా దూరంగా రైల్వేస్టేషన్.. ఓ అమ్మాయి శారీలో అటు తిరిగి నిలిచుని ఉంది. ఆమె కనిపించకుండా రెడ్ ఫ్లాగ్ ఒకటి ఆమె ఫేస్ ను కవర్ చేసింది. టైటిల్ పోస్టర్ తోనే ఓ ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేశాడు డైరక్టర్ అశోక్ తేజ్. ఇక ఈ సినిమాలో మళయాళ నటుడు సింహా హీరోగా హెబ్బా పటేల్, పూజిత పొన్నాడ హీరోయిన్స్ గా నటిస్తున్నట్టు తెలుస్తుంది.        
టైటిల్ పోస్టర్ మాత్రం అదిరిందని చెప్పొచ్చు. వెరైటీ టైటిల్ దానికి తగినట్టుగానే పోస్టర్ సినిమా ఆడియెన్స్ ను రీచ్ అవడానికి ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి. ఇక ఈ సినిమాలో అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమా కథ సంపత్ నంది రాశాడని సమాచారం. సో లాక్ డౌన్ టైంలో బ్రెయిన్ కి.. పెన్నుకి బాగానే పని చెప్పినట్టు ఉన్నాడు సంపత్ నంది. బ్లాక్ రోజ్ సినిమా కథ కూడా సంపత్ నంది రాసిందే అని తెలుస్తుంది. ఆ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతెలా నటిస్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: