ప్రభాస్ 'ఆదిపురుష్' లో కీలక రోల్ లో నటించనున్న రమ్యకృష్ణ .....??

GVK Writings
జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈశ్వర్ సినిమాతో హీరోగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, తొలి సినిమాతో మంచి సక్సెస్ ని అందుకున్నాడు. ఆ తరువాత శోభన్ దర్శకత్వంలో తెరకెక్కిన వర్షం సినిమాతో అతి పెద్ద విజయాన్ని అందుకున్న ప్రభాస్, అక్కడి నుండి వరుసగా అవకాశాలతో దూసుకెళ్లారు. అనంతరం ఛత్రపతి, మిస్టర్ పర్ఫెక్ట్, డార్లింగ్, మిర్చి సినిమాల సక్సెస్ తో మంచి క్రేజ్ దక్కించుకున్న ప్రభాస్, వాటి తరువాత రాజమౌళి తీసిన బాహుబలి రెండు సినిమాలతో దేశ విదేశాల్లో భారీ స్థాయిలో పాపులారిటీని, మార్కెట్ ని దక్కించుకున్నారు.  
ఇక ప్రస్తుతం జిల్ మూవీ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ మూవీ లో హీరోగా నటిస్తున్న ప్రభాస్, దీనితో కూడా మరొక పెద్ద విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే డెబ్భై శాతానికి పైగా షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ అతి త్వరలో ప్రారంభం కానుంది. ఇక దీని తరువాత నాగ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ వారు నిర్మించే సినిమాతో పాటు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆదిపురుష్ సినిమాలో కూడా ప్రభాస్ నటించనున్న విషయం తెలిసిందే. హిందువుల ఆరాధ్యదైవం శ్రీరామచంద్రుడి జీవిత గాథగా అత్యున్నత సాంకేతిక విలువలతో అత్యధిక ఖర్చుతో తెరకెక్కనున్న ఈ సినిమాలో బాలీవుడ్ సహా పలు ఇతర భాషలకు చెందిన నటులు ముఖ్య పాత్రల్లో నటించనున్నట్లు సమాచారం.  
ఇక లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమాలోని ఒక కీలక పాత్ర కోసం సీనియర్ నటీమణి రమ్యకృష్ణను ఎంపిక చేసిందట చిత్ర బృందం. గతంలో ప్రభాస్ నటించిన బాహుబలిలో శివగామి పాత్రలో అదరగొట్టిన రమ్యకృష్ణ అయితేనే ఆ పాత్రకు న్యాయం చేయగలరని భావించి ఆమెను ఎంపిక చేసినట్లు చెప్తున్నారు. మరి ప్రస్తుతం పలు మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలంటే ఆ మూవీ యూనిట్ నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే ....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: