స్టార్ దర్శకుడికి ఫుల్ డిమాండ్..!

NAGARJUNA NAKKA
బ్లాక్‌ బస్టర్‌ కొట్టిన డైరెక్టర్స్‌కి ఫుల్‌ డిమాండ్ ఉంటుంది. సూపర్‌ హిట్‌ మేకర్స్‌తో సినిమాలు చెేసేందుకు స్టార్‌ హీరోలు కూడా ఆసక్తి చూపిస్తుంటారు. అయితే బ్లాక్ బస్టర్స్ తో అదరగొడుతోన్న యంగ్ మేకర్స్ కి మాత్రం హీరోలే దొరకడం లేదు. ప్రేక్షకులని ఇంప్రెస్ చేసినా, స్టార్ల కాల్షీట్స్ మాత్రం పట్టుకోలేకపోతున్నారు.
‘సరిలేరు నీకెవ్వరు’తో బ్లాక్ బస్టర్ కొట్టాడు అనిల్ రావిపూడి. ఈ సినిమా 150 కోట్లకు పైగా వసూల్ చేసి అనిల్ ని స్టార్ రేసులోకి తీసుకొచ్చింది. అయితే అనిల్ రావిపూడి స్టార్ మేకర్ గా మారినా, ఈ దర్శకుడికి మాత్రం హీరోలే దొరకడం లేదు. లాక్ డౌన్ కి ముందే స్క్రిప్ట్ రెడీ చేసుకున్నా, అన్ లాక్ వన్ పాయింట్ ఓలు, 2 పాయింట్ ఓలు వచ్చినా వెతుకులాట మాత్రం ఆగడం లేదు.
అనిల్ రావిపూడి 'సరిలేరు నీకెవ్వరు' తర్వాత 'ఎఫ్‌-3' తీయాలనుకున్నాడు.  కరోనా లాక్‌డౌన్‌ లోనే ఈ సీక్వెల్‌కి స్క్రిప్ట్ కూడా కంప్లీట్‌ చేశాడు. అయితే 'ఎఫ్-2' స్టార్స్ వెంకటేశ్, వరుణ్ తేజ్ ఇద్దరు వేరే కమిట్‌మెంట్స్‌తో బిజీగా ఉన్నారు. పైగా కరోనా లాక్‌డౌన్‌తో ఈ హీరోల షెడ్యూల్స్‌ అన్ని మారిపోయాయి. దీంతో ఈ సీక్వెల్ ని పక్కనపెట్టి కొత్త సబ్జెక్ట్స్ రెడీ చేసుకుంటున్నాడట అనిల్.
అనిల్ రావిపూడి రీసెంట్‌గా బాలకృష్ణకు ఓ స్టోరీ నెరేట్ చేశాడని సమాచారం. బాలయ్యకు ఈ సబ్జెక్ట్ తెగ నచ్చేసిందని ప్రచారం జరుగుతోంది. అయితే నాలుగేళ్ల క్రితమే అనిల్‌ రావిపూడి, బాలయ్య కాంబోలో 'రామారావుగారు' అనే సినిమా  వస్తుందని టాక్ వచ్చింది. కానీ వర్కవుట్ కాలేదు. మళ్లీ ఇప్పుడీ కాంబోలో సినిమా వస్తుందని చెప్తున్నారు. అయితే  బాలయ్య బోయపాటి శ్రీనుతో సినిమా చేస్తున్నాడు. తర్వాత బి.గోపాల్‌తో సినిమా ఉంటుందని. మరి ఈ రెండు ప్రాజెక్ట్స్ పూర్తయ్యే వరకు అనిల్ వెయిట్‌ చేస్తాడా.. లేక మరో హీరో దగ్గరకికి వెళ్తాడా అనేది ఆసక్తికరంగా మారింది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: