ఆర్జీవీ కొత్త సినిమా ప్రముఖ జర్నలిస్ట్ పై..

Udayagiri Saketh
ఆర్జీవీ లాక్ డౌన్ లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. తన వరుస సినిమాలతో సెన్సేషన్ సృష్టిస్తున్నాడు. తాజాగా మరో కొత్త సినిమా అనౌన్స్ చేసాడు. ఈ సారి నేషనల్ ఫేమస్ జర్నలిస్ట్ అయిన ఆర్నాబ్ గోస్వామి మీద సినిమా తీయబోతున్నాడు. బాలీవుడ్‌లో ప్రముఖ హీరోలు, దర్శక, నిర్మాతలపై రిపబ్లిక్ టెలివిజన్ చీఫ్ ఎడిటర్ అర్నబ్ గోస్వామి చేసిన వ్యాఖ్యలపై రాంగోపాల్ వర్మ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సుశాంత్ మరణం నేపథ్యంలో వరుసగా తన చానెల్‌లో డిబేట్లు పెడుతూ బాలీవుడ్ ప్రముఖులను నెగిటివ్ గా చూపిస్తున్నాడు. ఈ క్రమంలో రిపబ్లిక్ టెలివిజన్‌ను తన ప్రచారానికి బాగా వాడుకొంటున్నారు అని వర్మ సైటైర్లు వేశారు.  అర్నబ్‌పై సినిమా తీస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేసి వరుస ట్వీట్లతో సోషల్ మీడియాలో హల్ చేశారు.  

ఆయన ట్వీట్స్ లో హలో అర్నబ్ గోస్వామి.. నా సినిమాలపై నీవు రియాక్ట్ అవుతావో లేదో తెలియదు. కానీ నా టార్గెట్ ఆడియెన్స్ మాత్రం నీ కోసం మాత్రం వెళ్లరు. కానీ నీ ప్రొగ్రాం చూసే ప్రేక్షకులను మాత్రం నేను షేక్ చేసేలా సినిమా తీస్తాను. రిపబ్లిక్ టీవీలో నీ పబ్లిక్ ఫేస్‌ను ఎండగడుతాను, ఒకవేళ నా సినిమా చూసి చెత్త అనుకొన్న ఫర్వాలేదు. ఎందుకంటే నిన్ను నేను నా పబ్లిసిటీకి నా సినిమాలో వాడుకొంటున్నాను కాబట్టి నీ మాటలను స్వాగతిస్తాను అని అన్నారు.
మరో ట్వీట్ లో బాలీవుడ్ ప్రముఖులైన ఆదిత్య చోప్రా, కరణ్ జోహర్, మహేష్ భట్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఇతర నటీనటులకు చివరగా ఓ సలహాను ఇవ్వదలచుకొన్నాను. మీరు మీ సినిమాల్లో ఎంతో మంది హీరోలను సృష్టించారు. మీరే హీరోలుగా మారారు. కానీ అర్నబ్ గోస్వామి లాంటి వాళ్లకు మీరంత విలన్‌లా మారాల్సిన అవసరం ఉంది. బాలీవుడ్‌లోని ఆదిత్య చోప్రా, కరణ్ జోహర్, మహేష్ భట్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్‌తో సహా ఎంతో మందిని క్రిమినల్స్‌గా, రేపిస్ట్‌గా చిత్రీకరిస్తున్నారు. ఆయన దాడికి భయపడి దాక్కోకుండా మగాళ్లలా ముందుకు రండి అంటూ వర్మ ట్వీట్ చేశారు. ఈ సినిమాకి 'అర్నబ్.. ది న్యూస్ ప్రాస్టిట్యూట్' అని పేరు పెట్టారు. మరి ఈ సినిమా ఎప్పుడు వస్తుందో చూడాలి.  

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: