పిల్లాడు Vs నెరజాణ

Prasad
టాలీవుడ్ లో మరో ఆసక్తికరమైన పోరు జరగనుంది. ఒకే తేదీని రెండు చిత్రాలు విడుదల కానున్నాయి. ఈ రెండు విభిన్నతరహాకు చెందిన చిత్రాలు కావడం విశేషం. మే 10న సాయికుమార్ తనయుడు ఆది హీరోగా నటించిన ‘సుకుమారుడు’ విడుదల కానుంది. అదే రోజున శ్రియ ప్రధాన పాత్రలో నటించిన ‘పవిత్ర’ విడుదల కానుంది. ఆది ఇప్పటి వరకూ నటించిన ‘ప్రేమ కావాలి’, ‘లవ్లీ’ చిత్రాలు విజయవంతంమయ్యాయి. ఈ మూడొవ సినిమా కూడా విజయవతం అవుతుందని అతను ధీమాగా ఉన్నాడు. పిల్ల జమీందర్ తో గుర్తింపు తెచ్చుకున్న అశోక్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి.  పవిత్ర సినిమాలో శ్రియ వేశ్యగా నటించడం ప్రధాన ఆకర్షణ. ఈ సినిమాలోని కొన్ని డైలాగులు ఇప్పటికే ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. దీంతో కొన్ని వర్గాలు సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.  మరి ఈ నెరజాణ, కుర్రాడులో  ఎవరు విజయాన్ని సొంతంచేసుకుంటారో వేచి చూడాలి...!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: