మనీ: వరి రైతులకు శుభవార్త.. పెరిగిన నూకల ధర..!!

Divya
రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధ దాడుల ప్రభావం మిగతా దేశాలపై కూడా పడడంతో సామాన్య ప్రజలు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఇప్పటికే వంట ధరలు మొదలుకొని గ్యాస్ ధరలు, తినే నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరిగిపోతున్నాయి. అంతే కాదు చికెన్, కోడిగుడ్డు, వంట ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో సామాన్యుడు ఏం తినాలో తెలియక సతమతమవుతున్నారు. ఇకపోతే ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో మొక్కజొన్నలకు కూడా బాగా డిమాండ్ పెరిగింది. అందుకే ఇప్పుడు అందరి దృష్టి నూకల పైన పడింది. దేశంలో నౌకలు కొనుగోలు చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ధరలు కూడా ఆకాశాన్ని అందుతున్నాయి.
దాంతో విరిగిన బియ్యానికి ఒక్కసారిగా డిమాండ్ పెరగడంతో వీటి ధరలు కూడా బాగా పెరిగిపోయాయి. దీంతో ఒక్కో క్వింటాల్ ధర రూ.2100 కి చేరుకుంది. దక్షిణ , పశ్చిమ,  ఆగ్నేయాసియా దేశాలలో మొక్కజొన్న కు ఘనంగా డిమాండ్ పెరిగిపోయింది. ఇక దీంతో మొక్కజొన్నలు కొనుగోలు చేయడం ఇబ్బందికరంగా మారడంతో ప్రతి ఒక్కరూ విరిగిన బియ్యాన్ని ఉపయోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇక్కడితో పోల్చుకుంటే అక్కడ దేశాలలో పశువులకు , కోళ్ళకు మేతగా మొక్కజొన్నలను ఉపయోగిస్తారు. ఇక వీటి ధర కూడా పెరగడంతో విరిగిన బియ్యాన్ని ప్రత్యామ్నాయంగా వాడుతున్నారు.

బంగ్లాదేశ్ , వియత్నం , ఇండోనేషియా , గల్ఫ్ దేశాలలో మొక్కజొన్న కు భారీగా డిమాండ్ పెరగడంతో కోల్కతాకు చెందిన ప్రైవేటు ఎగుమతి కంపెనీ ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ బిమల్ బెంగానీ బిజినెస్ లైన్ తో తెలిపారు. యుద్ధం కారణంగా మొక్కజొన్న సరఫరా బాగా దెబ్బతిందని అందుకే ఇండోనేషియా, వియత్నాం కంపెనీలు ఎక్కువగా విరిగిన బియ్యాన్ని డిమాండ్ చేస్తున్నారని స్పష్టం చేశారు. మొక్కజొన్న సీజన్ ముగియడంతో నిల్వలు లేక వీటి ధరలు అమాంతం పెరిగి పోయాయని.. ప్రస్తుతం రూ.2500 వరకు విక్రయిస్తున్నారు. ఇక వీటికి డిమాండ్ బాగా పెరగడంతో అందరూ నూకల బియ్యంపై ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. దీంతో రైతన్నలకు ఒక మంచి శుభవార్త అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: