హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: శ్రీకాళహస్తిలో బియ్యంకు తిరుగులేదా?

చిత్తూరు జిల్లాలో అధికార వైసీపీలో బాగా హైలైట్ అవుతున్న ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే అది బియ్యం మధుసూదన్ రెడ్డి అనే చెప్పొచ్చు. శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మధుసూదన్, .నిత్యం ప్రజల కోసం పనిచేస్తున్నారు. ప్రతి గ్రామం తిరుగుతూ సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తున్నారు. అర్హులైన ప్రతిఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చేస్తున్నారు.
నియోజకవర్గంలో కొత్తగా గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ కేర్ సెంటర్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. అటు శ్రీకాళహస్తి దేవాలయం అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ముక్కంటి ఆలయం నుంచి తొట్టంబేడు మండల పరిధిలోని అర్ధనారీశ్వర ఆలయం వరకు రోడ్డు నిర్మాణం చేయడానికి అనుమతి తీసుకొచ్చారు. శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో సి‌సి రోడ్లు, డ్రైనేజ్ పనులు చేయిస్తున్నారు. మురికి నీటి శుద్ధి ప్లాంటు పనులు మొదలుపెట్టారు. తుడా, శ్రీకాళహస్తి పురపాలక సంఘం సహకారంతో స్వర్ణముఖి సుందరీకరణకు రూ.14.5 కోట్లు వెచ్చించారు. నది కట్టను పటిష్టం చేసి థీమ్‌ పార్కులు, సెల్ఫీ స్పాట్‌లు, అమ్యూజ్‌మెంటు పార్కులు, జిమ్‌ వంటి సదుపాయాలు కల్పించడానికి కృషి చేస్తున్నారు.
ఇక ఈయన అప్పుడప్పుడు వెరైటీ పనులు కూడా చేస్తుంటారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో  ఎమ్మెల్యే ట్రాక్టర్లతో భారీ ర్యాలీ పెట్టి జాతీయ మీడియాకు ఎక్కారు. అయితే కరోనా కల్లోలంలో ప్రభుత్వానికి సాయం అందించిన దాతలు ఫోటోలని ట్రాక్టర్లల్లో పెట్టి ఊరేగించారు. అలా భారీ ర్యాలీ పెట్టిన బియ్యం బాగా హైలైట్ అయ్యారు. ఇటు అసెంబ్లీలో కూడా బియ్యం, ప్రతిపక్ష టీడీపీపై దూకుడుగానే వెళుతున్నారు. మొన్న ఆ మధ్య నారా లోకేష్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసి హల్చల్ చేశారు.
ఇక శ్రీకాళహస్తిలో మధుసూదన్ స్ట్రాంగ్‌గానే ఉన్నారు. అటు టీడీపీ తరుపున gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">బొజ్జల తనయుడు సుధీర్ కూడా యాక్టివ్ గానే పనిచేసుకుంటున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో గెలవాలనే పట్టుదలతో కార్యకర్తలని కలుపుకునిపోతూ, పార్టీని బలోపేతం చేస్తున్నారు. కాని ప్రస్తుతానికి మాత్రం శ్రీకాళహస్తిలో బియ్యంకు తిరుగులేదనే చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: