రాబోయే రోజుల్లో మగవాళ్లతో పని లేదు..! రోబోలు ఉంటే చాలు అంట..!

సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న నేపథ్యంలో కొత్త కొత్త ఆవిష్కరణలు తెరపైకి వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆవిష్కరణల్లో ప్రధానమైనవి రోబోలు. ఒకప్పుడు రోబోలు అనేక క్లిష్టమైన ఆపరేషన్లలో మాత్రమే పాల్గొనేవి. కానీ ఇటీవల వీటి వినియోగం పెరిగిపోయింది. సైన్యం చేపట్టే కార్యక్రమాల్లో పలు ఆపరేషన్లలో వీటిని వినియోగిస్తున్నారు.


క్లిష్టమైన పనులే కాకుండా ఇతర పనుల్లోను ఉపయోగిస్తున్నారు. రోబోల సాయంతో అధునాతన శస్త్ర చికిత్సలు, రెస్టారెంట్లలో సర్వీసులు, అంతరిక్ష ప్రయోగాలు, వంటి వాటిని చేస్తున్నారు. అయితే రోబోల వినియోగం ఇలానే పెరిగితే… అవి మనిషి జీవితంలో మరింత చర్చకు వస్తాయని.. ముఖ్యంగా రోబోలు ఆడవాళ్లపై తీవ్ర ప్రభావం చూపుతాయని శాస్త్ర వేత్తలు అంటున్నారు. అప్పట్లో శంకర్ దర్శకత్వంలో రజినీ కాంత్ హీరోగా ఐశ్వర్య రాయ్ హీరోయిన్ గా నటించిన రోబో  సినిమాలో మనిషి జీవితంలో ఎలాంటి మార్పులకు కారణం అవుతుందో చూపించాడు.


అప్పట్లో ఈ మార్పులు సినిమాటిక్ గా కనిపించినా.. వచ్చే ఆరు ఏళ్లలో సరిగ్గా  అలాంటి మార్పులే చోటు చేసుకుంటాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. రోబో సినిమాలో చిట్టి అనే హ్యూమనాయిడ్ అనే రోబో ఐశ్వర్య రాయ్ తో ప్రేమలో పడుతుంది. దాని కోసం తనను సృష్టించిన వసీకర్ ను చంపేయాలని అనుకుంటుంది రోబో. అయితే ఇలాంటి దుర్మార్గాలు చోటు చేసుకోలేకపోయినా.. వచ్చే ఆరేళ్లలో రోబోలు ప్రేమలో పడుతాయంట.


ముఖ్యంగా శృంగారం విషయంలో పురుషుల కంటే రోబోలనే స్త్రీలు ఎక్కువగా ఇష్టపడతారు అంట. ఈ విషయాన్ని ఫ్యూచరలాజిస్ట్ డాక్టర్ పియర్సన్ వెల్లడించారు. 2030 నాటికి వర్చువల్ రియాల్టీ శృంగారం సర్వసాధారణం అయిపోతుందని ఆయన ప్రకటించారు. 2035 నాటికి శృంగార సంబంధిత పరికరాలు దానితో అనుసంధానం అవుతాయని చెబుతున్నారు. 2050 నాటికి రోబోలోతో శృంగారం జరపడం సర్వసాధారణంగా మారుతుందని చెబుతున్నారు. ఒకవేళ ఆడవాళ్లు రిలేషన్లు కలిగి ఉన్నా.. కూడా రోబోలతో శృంగారానికి ప్రాధాన్యం ఇస్తారంట. అయితే ఇవన్నీ ఊహజనితమే అయినా.. అలాంటి వాటికి స్త్రీలు ప్రాధాన్యం ఇవ్వరని కొందరు కొట్టి పారేస్తున్నారు. ప్రేమ అంటే శృంగారం ఒక్కటే కాదు అని.. మనిషి సంబంధిత అనేక భావాలను రోబో ఎలా పలికిస్తుందని కొందరు ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: