రోజస్తమాను ఏసీ గదిలో కూర్చుంటే ఏమవుతుందో తెలుసా..!

lakhmi saranya
ప్రస్తుత కాలంలో ఎవరైనా కానీ ఏసీ లేకపోతే అసలు ఉండలేకపోతున్నారు. ఏ ఫంక్షన్ కైనా వెళ్లిన సరే AC  కంపల్సరిగా ఉండాల్సిందే. ఎయిర్ కండిషనర్లు ఇండోర్ ఉష్ణోగ్రతలు, తేమను ని అంతరించటంలో సహాయపడతాయి, మరింత సౌకర్యవంతమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. బయట ఎండలో నుంచి వచ్చినప్పుడు చాలా ఉపశమనం కలిగిస్తాయి. కానీ AC ని క్రమం తప్పకుండా, ఎక్కువసేపు ఉపయోగించటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అవేంటి?ఎలా అదుపులో ఉంచాలి? తెలుసుకుందాం.
ఎయిర్ కండిషనర్లు కండెన్సేషన్, బాప్పిభవనం ప్రక్రియ ద్వారా గాలి నుంచి తేమను తగ్గిస్తాయి. AC ని చాలా తక్కువ ఉష్ణోగ్రతకు సెట్ చేసి తేమ తగ్గించటం వల్ల గదిలో గాలి పొడిగా మారుతుంది. దీంతో చర్మం పొడిబారటం, దురద, కంటి చికాకు వంటి సమస్యలకు దారితీస్తుంది. ఎయిర్ కండీషనర్ ల నుంచి వచ్చే చల్లటి గాలి వివిధ శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుంది, ముక్కు కారడం, పొడి గొంతు, దగ్గు వంటివి తలెత్తుతాయి. ముఖ్యంగా ఉభసం లేదా అలెర్జీలు ఉన్న వ్యక్తులలో...శ్వాసకోశ నరాలు ఇన్ఫెక్షన్ కు గురయ్యే అవకాశం ఉంది.
 చల్లని గాలి, పొడిగాలి, ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులు, పెలవమైన గాలి నాణ్యత, అంతరాయం కలిగించే నిద్ర కారణంగా ఎయిర్ కండిషనింగ్ అప్పుడప్ప్పుడు తలనొప్పికి కారణం అవుతుంది. ఈ సమస్యలు అలసట, పగటిపూట మగతకు కూడా దారి తీయవచ్చు. AC లు గాలి నుంచి తేమను తొలగిస్తాయి. ఫలితంగా పొడి గాలి చర్మం నుంచి తేమ బాప్పిభవనాన్ని వేగవంతం చేస్తుంది. శరీరం తేమను తిరిగి నింపడం కంటే వేగంగా కోల్పోయినప్పుడు... నిర్జలీకరణం ఏర్పడుతుంది. అందువల్ల ఎయిర్ కండిషన్డ్ పరిసరాలలో ఎక్కువ కాలం గడపటం వల్ల తేలిక పార్టీ డిహైడ్రేషన్ కు దారితీస్తుంది. AC లను తక్కువసేపు లేదా వాటిని చాలా తక్కువ ఉష్ణోగ్రతల వద్ద యూస్ చేయటం ఆర్థరైటిస్, ఎగ్జిమా, సోరియాసిస్, సైనసిటిస్ వంటి ముందుగా ఉన్న అనారోగ్య పరిస్థితులు తీవ్రం అవుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: