ఈ పండు ఖచ్చితంగా తినాలి?

Purushottham Vinay
చలికాలం ముగిసిపోతుంది.వేసవి కాలం స్టార్ట్ అవ్వబోతుంది.ఈ వేసవి కాలంలో ఖచ్చితంగా డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశాలు చాలా పుష్కలంగా ఉంటాయి. కాబట్టి నీటి శాతం ఉన్న ఆహారాలు ఎక్కువగా తీసుకోవాలి. ఈ సమ్మర్‌లో పైనాపిల్ విరివిగా లభిస్తుంది. దీన్ని సలాడ్‌లా.. జ్యూస్ లా తీసుకోవచ్చు. పైనాపిల్ రుచి కాస్త భిన్నంగా ఉంటుంది. తియ్యగా.. పుల్లగా.. కాస్త వగరుగా.. జ్యూసీగా ఉంటుంది. ఇందులో కాపర్, మాంగనీస్, డైటరీ ఫైబర్, విటమిన్ సి, బి6, ఫోలేట్ వంటివి ఎక్కువగా లభిస్తాయి. కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుంది. మరి సమ్మర్‌లో పైనాపిల్ తింటే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.వేసవి కాలంలో త్వరగా డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశాలు  ఎక్కువగా ఉన్నాయి. అందుకే పైనపిల్ ఎక్కువ తినడం వల్ల ఈ సమస్య నుంచి బయట పడేస్తుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. ఇంకా అంతే కాకుండా గుండె జబ్బులు రాకుండా చేస్తుంది. అలాగే డయాబెటీస్ ఉన్న వారు కూడా పైనాపిల్ హ్యాపీగా తినొచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.


ఎందుకంటే ఇందులో గ్లైసెమిక్ ఎక్కువగా ఉంటుంది.వేసవిలో జీర్ణ క్రియకు సంబంధించి సమస్యలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. దీని వల్ల అజీర్తి, విరేచనాలు లేదా మల బద్ధకం, గ్యాస్ వంటి సమస్యలు ఎదురవుతాయి. కానీ పైనాపిల్ తీసుకుంటే ఆ సమస్యలు రాకుండా చూడొచ్చు. ఇది కడుపు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది.పైనాపిల్ తింటే శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఎందుకంటే ఇందులో విటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయ పడుతుంది. కాబట్టి రోగాలతో పోరాడే శక్తి లభిస్తుంది. అంతే కాకుండా ఈ ఫ్రూట్ తింటే తక్షణమే ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి. సమ్మర్‌లో రోగ నిరోధక శక్తి, ఎనర్జీ లెవల్స్ చాలా అవసరం.పైనాపిల్ తినడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ ఫ్రూట్‌లో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు.. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతే కాకుండా చర్మంపై ఉన్న మచ్చలను తగ్గించి, చర్మానికి కాంతివంతంగా తయారు చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: