మైగ్రేన్ సమస్య తో ఉన్నవారు ఈ ఆహారాలను తినకూడదా..!!

Divya
సాధారణంగా తలనొప్పి వస్తే వీటిని భరించడం చాలా కష్టము. అలాంటిది మైగ్రేన్ అనేది చాలా తీవ్రమైన ఒత్తిడిని నొప్పిని సైతం గురిచేస్తుంది.. మైగ్రీన్ అంటే తలలో ఒకవైపు వచ్చే తలనొప్పి వస్తే అసలు నిద్ర కూడా పట్టదట.. అలాగే ఏం పని చేయాలన్న చేయలేరని ఈ మైగ్రేన్ తో పాటు చాలా మందిలో వికారం వాంతులు వంటివి కూడా వస్తాయట .కొందరికి ఇది ఒకవైపు వస్తే మరి కొంతమందికి కుడి , ఎడమ మార్చి మార్చి వస్తూ ఉంటుందట. అయితే ఈ మైగ్రేన్ సమస్య తీవ్రమైన ఒత్తిడి వల్ల వస్తుందని చెప్పవచ్చు.


ఇలా ఒకవైపు తలనొప్పితో ఇబ్బంది పడేవారు కచ్చితంగా కొన్ని ఆహార పదార్థాలను తినకుండా ఉండడమే మంచిదంటూ ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.. అలాంటి వాటిలో పులియబెట్టిన ఆహారం తినకూడదట. ఇందులో థైరా మెన్ అనే పదార్థం ఉంటుందట.. దీనివల్ల మైగ్రేన్ అనేది చాలా పెరిగిపోతుంది వీలైనంతవరకు ఇలాంటి ఆహారాలని దూరంగా ఉంచడమే మంచిది.

ఆల్కహాల్ లో ఇథనాల్ అనే పదార్థం ఉండడం వల్ల మైగ్రీన్ సమస్య మరింత ఎక్కువ అవుతుంది. ఇది మన శరీరంలోకి వెళ్ళగానే ఒక రసాయనంగా మారుతుందట. దీనివల్ల మైగ్రేన్ సమస్య అనేది చాలా తీవ్రమైన ఒత్తిడికి గురయ్యేలా చేస్తుంది. అందుకే మైగ్రేన్ సమస్యతో బాధపడేవారు ఆల్కహాల్ కి దూరంగా ఉండటం మంచిది.


చల్లగా ఉండే ఎలాంటి పదార్థాలను కూడా మైగ్రేన్ సమస్యతో ఉన్నవారు తీసుకోకూడదు. ఇవి ఎక్కువగా చల్లదనాన్ని చేసి తీవ్రమైన నొప్పిని సైతం కలిగిస్తాయట. అందువల్లే వీలైనంతవరకు వీటికి దూరంగా ఉండటం మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


చాలామంది తలనొప్పి వస్తే ఖచ్చితంగా టీ, కాఫీ వంటివి తాగుతూ ఉంటారు. అయితే ఇందులో ఎక్కువగా కెఫిన్ పదార్థం ఉండడం వల్ల ఇది మైగ్రేన్ సమస్యను తీవ్రం అయ్యేలా చేస్తుంది.. కాబట్టి టీ కాఫీలు చాక్లెట్లు ఇతరత్రా వాటిని దూరం చేయడమే మంచిది. అయితే ఇలాంటి సమస్య రాగానే వైద్యులను సంప్రదించడం చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: