కిడ్నీలు పాడవకుండా ఈ జాగ్రత్తలు పాటించండి?

Purushottham Vinay
కిడ్నీలు పాడవకుండా ఈ జాగ్రత్తలు పాటించండి?


మన కిడ్నీలు పాడవడానికి ముఖ్యంగా మూడు కారణాలు ఉంటాయి. మూత్రపిండాలు పాడవడానికి గల కారణాలల్లో ఖచ్చితంగా షుగర్ వ్యాధి కూడా ఒకటి. నేటి కాలంలో 40 శాతం మంది షుగర్ వ్యాధి గ్రస్తులు మూత్రపిండాల వైఫల్యంతో బాధపడుతున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి షుగర్ వ్యాధి గ్రస్తులు ఖచ్చితంగా మూత్రపిండాల ఆరోగ్యంపై మరింత శ్రద్ద చూపించాలి. ఇంకా అలాగే అధిక రక్తపోటు వల్ల కూడా మూత్రపిండాలు ఈజీగా దెబ్బతింటాయి.రక్తపోటు వల్ల మూత్రపిండాలకు రక్తప్రసరణ అంత సాఫీగా సాగదు. అందువల్ల మూత్రపిండాలు దెబ్బతింటాయి. ఇంకా అలాగే కొన్ని రకాల వైరస్, బ్యాక్టీరియాల ఇన్పెక్షన్ కారణంగా మూత్రపిండాల పనితీరు బాగా దెబ్బతింటుంది. కాబట్టి షుగర్, బీపీ సమస్యలతో బాధపడే వారు అలాగే ఎటువంటి సమస్య లేకపోయినప్పటికి ఆరోగ్యంపై శ్రద్ద చూపించేవారు సంవత్సరానికి ఒకసారి మూత్రపిండాలకు సంబంధించిన పరీక్షలు ఖచ్చితంగా చేయించుకోవాలి.



ఇంకా అలాగే యూరిన్ ఆల్బుమిన్ టెస్ట్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్( క్రియాటిన్ టెస్ట్), ఇఎఫ్ఆర్( గోమ్యులర్ ఫిల్ట్రేషన్ రేట్) వంటి టెస్ట్ లను చేయించుకోవాలి.ఖచ్చితంగా డాక్టర్ ను సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మన మూత్రపిండాలు వైఫల్యం చెందకుండా ఉండాలంటే షుగర్, బీపీ వంటి సమస్యలు ఖచ్చితంగా అదుపులో ఉండేలా చూసుకోవాలి. ఇంకా అలాగే ఉప్పును తక్కువగా తీసుకోవాలి. ఖచ్చితంగా బరువు అదుపులో ఉండేలా చూసుకోవాలి. ధూమపానం ఇంకా ఆల్కహాల్ వంటి వాటికి దూరంగా ఉండాలి. ప్రతి రోజూ తగినంత నిద్రపోవాలి. అలాగే ఒత్తిడి, ఆందోళన వంటివి దరి చేరకుండా చూసుకోవాలి. అలాగే కూరగాయలు, పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. నీటిని ఎక్కువగా తాగాలి. ఈ విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మన మూత్రపిండాలు పాడవకుండా వాటి ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.కాబట్టి ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు పాటించండి. కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: