వానా కాలం వచ్చిందంటే ఖచ్చితంగా రోగాలని తీసుకొస్తుంది. ఈ కాలంలో జీర్ణ సమస్యలు, కడుపుకు సంబంధించిన సమస్యలు రావడం చాలా కామన్గా మారింది. ఈ కాలంలో చాలా మంది తరచుగా లూజ్ మోషన్కు గురవుతారు.వర్షా కాలంలో బ్యాక్టీరియా కూడా ఎక్కువగా పెరుగుతుంది. అలాగే కలుషిత ఆహారం కారణంగా జీర్ణ సమస్యలు కూడా ఎక్కువగా వస్తాయి.లూజ్ మోషన్ అనేది మన శరీరాన్ని పిండేస్తుంది.ఈ లూజ్ మోషన్ సమయంలో.. శరీరంలో నీరు, పోషణ లేకపోవడం జరుగుతుంది. అందువల్ల చాలా మంది ఔషధం తీసుకుంటారు. అయితే న్యాచురల్ గా చాలా అద్భుతమైన హోం రెమెడీస్ ఉన్నాయి. వీటిని ట్రై చెయ్యడం ద్వారా మీరు సులభంగా లూజ్ మోషన్ నుంచి ఉపశమనం పొందవచ్చు. లూజ్ మోషన్ ని ఎలాంటి హోం రెమెడీస్ ఈజీగా తగ్గిస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
కొబ్బరి నీళ్లలో చాలా పొటాషియం లభిస్తుంది.ఇది ఈజీగా శరీరంలో ఎలక్ట్రోలైట్స్ లోపాన్ని తీరుస్తుంది.దీని వల్ల మీకు శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా త్వరగా లూజ్ మోషన్ను అధిగమించడంలో ఉపశమనం లభిస్తుంది.అలాగే నిమ్మరసం తాగడం వల్ల లూజ్ మోషన్ నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది. నిమ్మరసంలోని ఆమ్ల మూలకాలు పేగుల్లో దాగి ఉన్న బ్యాక్టీరియాను ఈజీగా చంపి, పేగులను బాగా శుభ్రపరుస్తుంది. అందువల్ల, రోగికి తప్పనిసరిగా నిమ్మరసం కలిపిన నీటిని ఇవ్వాలి.ఈ లూజ్ మోషన్ సమయంలో, శరీరంలో తరచుగా నీటి కొరత అనేది ఏర్పడుతుంది.
శరీరం కూడా నిర్జలీకరణానికి గురవుతుంది. అలాంటి పరిస్థితిలో, ఉప్పు, చక్కెర ద్రావణాన్ని తయారు చేసి రోగికి ఇవ్వాలి. దీని కారణంగా, నీటి కొరత కూడా ఈజీగా తీరుతుంది. ఇంకా కడుపు ఇన్ఫెక్షన్ కూడా ముగుస్తుంది.లూజ్ మోషన్ విషయంలో రోగికి అరటిపండు తినిపించాలి. నిజానికి, అరటిపండులో పొటాషియం ఉంటుంది, ఇది శరీరంలోని ఎలక్ట్రోలైట్ల లోపాన్ని తొలగిస్తుంది. అందుకే రోగికి రోజూ ఒకటి లేదా రెండు పండిన అరటిపండ్లు తినిపిస్తే ఉపశమనం కలుగుతుంది.లూజ్ మోషన్ను ఆపడానికి పెరుగు చాలా ప్రభావవంతమైన మార్గం. పెరుగు సహజమైన ప్రోబయోటిక్. ఇందులో ఉండే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా వదులుగా ఉండే బ్యాక్టీరియాను చంపుతుంది. అందుకే పెరుగును లూజ్ మోషన్లో తింటే ఈ సమస్యను చాలా ఈజీగా పరిష్కరించుకోవచ్చు.