వంటల్లో కారం పొడి బదులు ఈ పొడి వాడండి.. ఎన్నో లాభాలు?

Purushottham Vinay
ఇక ఎండు మిరపకాయలతో చేసిన కారం పొడిని వాడడం వల్ల మన ఆరోగ్యానికి హాని కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎండుమిరపకాయలు, అలాగే వాటితో చేసే కారం పొడి మనకు మంచి కంటే చెడునే ఎక్కువ చేస్తాయని వారు తెలియజేస్తున్నారు.ఈ మిరపకాయలు పచ్చిగా ఉన్నప్పుడు వాటిలో 50 శాతం కారం ఉంటుందని, అవి పండిన తరువాత వాటిలో కారం 75 శాతంగా ఉంటుందని ఇంకా అలాగే అవి పూర్తిగా ఎండి ఎండుమిరపకాయలుగా అయిన తరువాత వాటిలో 100 శాతం కారం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పచ్చిమిరపకాయలు ఎండే కొద్ది వాటిలో నీటి శాతం తగ్గి ఘాటు శాతం బాగా పెరుగుతూ ఉంటుంది.మనం ఎక్కువగా వంటల్లో ఎండు మిరపకాయలతో చేసే చిల్లీ ప్లేక్స్ ను వేస్తూ ఉంటాము. ఇవి మన పొట్టలోకి వెళ్లినప్పటికి అవి జీర్ణం కావని వాటిని ఎలా తిన్నామో అలానే మలం ద్వారా బయటకు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే కూరల్లో ఎండు కారం పొడికి బదులుగా పచ్చి మిరపకాయలను వాడడం మంచిదని ఆరోగ్య నిపుణులు నిపుణులు సూచిస్తున్నారు. అయితే కొందరికి పచ్చి మిరపకాయల కారం అసలు ఏ మాత్రం పడదు. ఇక అలాంటి వారు పచ్చి మిరపకాయలకు అలాగే వంటల్లో ఎండు కారం పొడిని బదులుగా మిరియాల పొడిని వాడవచ్చు. మన పూర్వకాలంలో వంటల్లో కారానికి బదులుగా మిరియాల పొడినే వాడేవారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


అసిడిటీ, ప్రేగు పూతలు ఇంకా అల్సర్లు వంటి సమస్యలతో బాధపడే వారు ఎండు కారాన్ని తీసుకోవడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతుంది.అందుకే ఎండు కారాన్ని పూర్తిగా మానేయాలి. సాధారణంగా ఎండు కారానికి బదులు వంటల్లో మిరియాల పొడి ఇంకా పచ్చి కారాన్ని వాడడమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.వంటల్లో మిరియాల పొడిని వాడడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. ఇంటి చిట్కాల్లో అలాగే దగ్గు, జలుబు వంటి సమస్యలతో బాధపడేటప్పుడు మనం మిరియాలతో కషాయాన్ని ఇంకా మిరియాల పాలను ఎక్కువగా తీసుకుంటూ ఉంటాము.ఈ మిరియాల్లో పెప్పరిన్ అనే రసాయనం ఉంటుంది. ఇది అలర్జీలకు కారణమయ్యే హిస్టమిన్ ఉత్పత్తిని ఈజీగా తగ్గిస్తుంది. అలాగే దీంతో శ్లేష్మం ఎక్కువగా ఉత్పత్తి అవ్వదు. దీంతో మనకు దగ్గు కూడా తగ్గుతుంది.ఇంకా అలాగే మిరియాలను ఉపయోగించడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అలాగే మతిమరుపు, అల్జీమర్స్ వంటి సమస్యలు రాకుండా చేయడంలో కూడా ఈ మిరియాలు మనకు సహాయపడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: