రాత్రిపూట భోజనం చెయ్యట్లేదా? అయితే పెను ప్రమాదమే!

Purushottham Vinay
ప్రస్తుతం చాలా మంది కూడా బరువు తగ్గడం కోసం రాత్రిళ్లు భోజనం మానేస్తుంటారు. అలాగే మారుతున్న జీవనశైలి కారణంగా మధ్యాహ్నం పూట ఆలస్యంగా భోజనం చేయడం వలన డిన్నర్ స్కిప్ చేస్తుంటారు.మరికొందరు నిద్రపోవడానికి డిన్నర్ చేయకుండా ముందు కూడా గ్లాసు పాలు తాగి పడుకుంటారు. కానీ రాత్రిపూట భోజనం మానేయడం వలన ఆరోగ్యానికి పెను ప్రమాదం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.. ఆకలితో నిద్రపోవడం వలన ఈ ఆరోగ్యమే కాకుండా మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది.. ప్రతి రోజూ కూడా రాత్రిళ్ళు భోజనం మానేయడం వలన అనేక సమస్యలను వారు ఎదుర్కోవాల్సి వస్తుంది.ఇక రాత్రిపూట ఆహారం తీసుకోకపోవడం వల్ల బరువు తగ్గుతుందని కొందరు అనుకుంటారు, అయితే ఇది నిజంగా సాధ్యమేనా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం… రాత్రి భోజనం మానేయడం అనేది ఆరోగ్యానికి అసలు మంచిది కాదు.. రాత్రి పూట డిన్నర్ చేయకపోవడం వలన నిద్రభంగం కలుగుతుంది.ఇక వ్యక్తి రాత్రి 10 లేదా 11 గంటలకు నిద్రపోయే వారు తేలికపాటి ఆహారాన్ని తీసుకోవాలి.. అలాగే 8 నుంచి 9 గంటలు నిద్రించేవారు రాత్రిళ్ల పూట భోజనం మానేయవచ్చు.. లేదా సాయంత్రం నీరు ఇంకా ఎక్కువగా పండ్లను తీసుకోవచ్చు.


రాత్రిపూట మళ్లీ మళ్లీ తినకుండా ఉండడం వలన శారీరక ఇంకా మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. రాత్రిపూట ఆహారం తీసుకోని అలవాటు ఉన్నవారు చాలా ఎక్కువగా ఆందోళనకు గురవుతారు. ఎందుకంటే ఆహారం తీసుకోకపోవడం మానసిక ఆరోగ్యంపై చాలా ప్రతికూల ప్రభావం చూపుతుంది. ప్రతిరోజు కూడా రాత్రి భోజనం మానేసే వ్యక్తులు జంక్ ఫుడ్ లేదా రాత్రిపూట అనారోగ్యకరమైన ఆహారాన్ని వారు తీసుకుంటారు. ఇది మానసిక ఇంకా అలాగే శారీరక ఆరోగ్యానికి మంచిది కాదు. ఇది ఆందోళన స్థాయిలను పెంచుతుంది. అలాగే రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది. ఇంకా ఇది ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ మరింత ఉత్పత్తికి దారితీస్తుంది.అలాగే రాత్రిపూట ఆహారం తీసుకోవడం మానేయడం వలన నిద్రలేమికి గురవుతారు.. ఇంకా మానసిక ఆరోగ్యానికి మంచిది కాదు. డిప్రెషన్ ఇంకా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.. నిదకు ఆటంకం కూడా కలుగుతుంది.అలాగే నిద్రలేమి సమస్య తీవ్రంగా వేధిస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: