బంపర్ ఆఫర్.. రూపాయికే బిర్యాని.. కానీ చిన్న ట్విస్ట్?

praveen
చికెన్ బిర్యాని.. ఈ పేరు చెప్పగానే అందరికి నోరూరిపోతూ ఉంటుంది అనిచెప్పాలి. సాధారణంగా ఏ ఆహారం అయినా సరే రోజు తీసుకుంటే బోర్ కొడుతూ ఉంటుంది. కానీ ఎందుకో బిర్యాని మాత్రం ప్రతిరోజు తిన్న ఇంకా తినాలి అనిపిస్తుంది తప్ప ఎక్కడ బోర్ కొట్టదు అని చెప్పాలి. ఇక ఇటీవల కాలంలో బిర్యాని కి ఉన్న డిమాండ్ ఆధారంగా అటు బిర్యానీ రేట్ కూడా అంతకంతకు పెరిగిపోతూ ఉండడం గమనార్హం. ఇలాంటి సమయంలో కొన్ని రెస్టారెంట్లు బిర్యాని కి ఉన్న క్రేజ్ ను ఉపయోగించుకుని తమ రెస్టారెంట్లకు పాపులారిటీ పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. అందరూ అమ్మే రేట్ల ప్రకారం కాకుండా అతి తక్కువ రేట్లకే బిర్యానీ అమ్ముతూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి అని చెప్పాలి.

 ఇక్కడ ఒక రెస్టారెంట్ ఇలాంటి ఆఫర్ ప్రకటించింది. కేవలం ఒక్క రూపాయికే నోరూరించే చికెన్ బిర్యాని ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ చికెన్ బిర్యాని తినాలి అంటే ప్రకాశం జిల్లా మార్కాపురం వెళ్లాల్సిందే. ఓ రెస్టారెంట్ ఓపెనింగ్ సందర్భంగా రూపాయికే బిర్యానీ అంటూ ఆఫర్ ప్రకటించారు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ పెట్టారు. సాధారణంగా రూపాయి కాయిన్ కాకుండా ఒకప్పుడు వాడుకలో ఉన్న రూపాయి నోటు తీసుకువస్తే ఇక బిర్యాని పొందవచ్చు. మధ్యాహ్నం 12 గంటల నుంచి రెండు గంటల వరకు బిర్యాని ఫ్రీ అని ఫ్లెక్సీ ని కూడా ప్రదర్శించారు.

 ఇంకేముంది ఈ విషయం తెలుసుకున్న బిర్యాని ప్రియులు అక్కడికి పరుగులు పెట్టారు. రూపాయి నోటుతో ఆ రెస్టారెంట్ కు క్యూ కట్టారు.  ఎండను సైతం లెక్కచేయకుండా బిర్యానీ కోసం ఎగబడ్డారు అని చెప్పాలి. దీంతో వచ్చిన రెస్పాన్స్ చూసి రెస్టారెంట్ యాజమాన్యం ఒక్కసారిగా షాక్ అయింది. దీంతో వెంటనే బిర్యాని అమ్మే షట్టర్ క్లోజ్ చేసింది. ఫలితంగా అక్కడికి వచ్చిన బిర్యాని ప్రియులు ఎండలో పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తర్వాత ఒక చిన్న కౌంటర్ ఏర్పాటు చేసి రూపాయ నోటు తెచ్చుకున్న వారికి పార్సెల్ రూపంలో బిర్యాని ప్యాకెట్లను అందజేసారు. ఏదేమైనా రూపాయి బిర్యాని ఆఫర్ మాత్రం రెస్టారెంట్ కు ఒక్కసారిగా పాపులారిటీ తెరిచిపెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: