మతిమరుపు సమస్య తగ్గాలంటే..?

Purushottham Vinay
ఈ రోజుల్లో మతిమరుపు సమస్య అనేది చాలా అంటే చాలా సాధారణం అయిపోయింది. అయితే ఈ సమస్యకి పరిష్కారం పిస్తా పప్పుతో చెప్పవచ్చు. మతిమరుపు సమస్యను చాలా ఈజీగా అదుపులో ఉంచవచ్చు. పిస్తాలో చాలా ఖనిజాలు ఉంటాయి. ఇవి మెదడు పనితీరును చాలా బాగా మెరుగుపరుస్తాయి. మెదడును మరింత చురుకుగా చేస్తాయి. అందుకే పిస్తా తినడం వల్ల జ్ఞాపకశక్తి ఖచ్చితంగా మెరుగుపడుతుంది. పిస్తా తినడం అనేది గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ప్రతిరోజూ కొన్ని పిస్తాపప్పులను తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ అనేది చాలా ఈజీగా తొలగిపోతుంది. గుండెను అన్ని ప్రమాదాల నుంచి ఇది కాపాడుతుంది. అందుకే దీన్ని మన గుండెకు అనుకూలమైన ఆహారాలలో ఒకటిగా పరిగణిస్తారు.ఇంకా అలాగే ఇందులో ఫైబర్, కార్బోహైడ్రేట్స్, అమైనో ఆమ్లాలు, విటమిన్లు A, K, C, B-6, D, E, ప్రోటీన్, కాల్షియం, మాంగనీస్, ఫోలేట్ ఇంకా అలాగే ఇతర డ్రై ఫ్రూట్స్ కంటే తక్కువ కొవ్వు, కేలరీలు ఇందులో ఉంటాయి.


దీనిని మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరం అనేక ప్రయోజనాలను పొందుతుంది. మీకు కనుక ఎక్కువ ఆకలిగా అనిపిస్తే, మీరు సాయంత్రం అల్పాహారంగా కూడా ఈ పిస్తాపప్పులను తినవచ్చు.పిస్తా పప్పు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని చాలా పరిశోధనలు సూచిస్తున్నాయి. క్యాన్సర్ నిరోధకంలో సహాయకారిగా పరిగణించే పిస్తాపప్పులో యాంటీ కార్సినోజెనిక్ మూలకాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి క్యాన్సర్‌ని నివారించేందుకు సహాయపడతాయి. బలమైన ఎముకలకు విటమిన్ డి ఇంకా కాల్షియం చాలా అవసరం. ఈ రెండు కూడా పిస్తాపప్పులో ఉంటాయి. అలాంటి పరిస్థితిలో దీని రోజువారీ వినియోగం ఎముకలకు బాగా బలాన్నిస్తుంది. ఎముకలకు సంబంధించిన అన్ని వ్యాధుల నుంచి కూడా చాలా ఈజీగా ఉపశమనాన్ని అందిస్తుంది.కాబట్టి ఖచ్చితంగా పిస్తా పప్పు తినండి. అనేక ప్రయోజనాలు పొందండి. ఆరోగ్యంగా ఎలాంటి జబ్బులు రాకుండా జీవించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: