నిమ్మరసం రాసుకుంటే ఆ సమస్యలకు చెక్.. కానీ ?

Satvika
15 ఏళ్ళ వయసు వచ్చిందంటే యువతకు చర్మ సమస్యలు బాధించవచ్చును.. చర్మం పై మొటిమలు రావడం లేదు చర్మం నల్లగా మారడం జరుగుతుంది. దీంతో చూడటానికి అంధవిహీనంగా కనిపిస్తుంది.. ఇక ఆ సమస్యల నుంచి బయటపడాలని ఎన్నెన్నో చేస్తూ వస్తారు. వాటి వల్ల ఎటువంటి బెనిఫిట్స్ లేకపోవడంతో మళ్ళీ న్యాచురల్ టిప్స్ ను ఫాలొ అవుతున్నారు.. ముఖ్యంగా నిమ్మరసం వల్ల ఎన్నో చర్మ రోగాలను నయం చేస్తున్నది అంటున్నారు..  అయితే ఎలా నిమ్మరసం రాసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం...



నిమ్మకాయ ఆరోగ్యానికి మాత్రమే కాదు అందానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. నిమ్మకాయలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు సమృద్ధిగా ఉన్నాయి. పైగా నిమ్మకాయ వాడడం వల్ల ఎటువంటి సమస్యలు రావు.ముందుగా ఒక బౌల్ లో కొద్దిగా పాలు, ఆరెంజ్ తొక్కల పొడి, నిమ్మ రసం కలిపి మీ ముఖాని కి అప్లై చేసుకుని కొద్దీ సేపటి తర్వాత శుభ్రం చేసుకుంటే మీ చర్మ సమస్యలు దూరం అవుతాయి. ఇది ముఖానికి నాచురల్ స్క్రబ్ లాగా ఉపయోగపడుతుంది.



మీ ముఖం అందంగా మచ్చలు లేకుండా కాంతి వంతంగా మారాలంటే అరటి పండు గుజ్జు లో, కొద్దిగా నిమ్మరసం వేసుకుని కలిపి మీ ముఖానికి రాసుకుని పది నిముషాల తర్వాత కడిగేసుకుంటే మీ ముఖహం అందంగా మారుతుంది.నిమ్మరసం, తేనే, కొద్దిగా ఉడికించి ముద్ద చేసుకున్న క్యాబేజీ ని బాగా కలిపి పేస్ట్ లాగా చేసుకుని ముఖాని కి అప్లై చేసుకుని 10 నిముషాల తర్వాత కడిగితే మంచి ఫలితం ఉంటుంది.. ఇంక ఆలస్యం ఎందుకు ఈ టిప్స్ నచ్చిందంటే మీరు కూడా ట్రై చెయ్యండి.. మీ అందాన్ని కాపాడుకోండి.. ఇప్పుడున్న పరిస్థితుల్లో నిమ్మ అమ్మ అనే సంగతి మర్చిపో కండి.. ఎన్నో ఔషద గుణాలు నిమ్మ లో ఉన్నాయి.. కరోనా పై జాగ్రత్తలు తీసుకొని ప్రాణాల ను

 కాపాడుకోండి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: