బుడుగు: పిల్లలు ఒమిక్రాన్ బారిన పడకుండా ఉండాలంటే..!!

N.ANJI
గత రెండు సంవత్సరాలు కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని అతలాకుతహలం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సిన దుస్థితి నెలకొంది. ఇక ఇప్పుడిప్పుడే ఈ మహమ్మారి నుండి కొంతం ఉపశనం పొందుతున్న ప్రజలకు మళ్లీ మరో వైరస్ కలవర పెడుతుంది అదే ఒమిక్రాన్. ఈ మహమ్మారి బారిన చిన్నారులు పడకుండా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ నియమాలు పాటించండి.
ఇప్పటివరకు దేశంలో పెద్ద వాళ్ళు చాలా మంది వ్యాక్సిన్‌ని వేయించుకున్నారు. కానీ చిన్న పిల్లలు ఇంకా వ్యాక్సిన్ వేయించలేదు. అందుకే పిల్లల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. పిల్లల్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి అనే విషయం గురించి వెల్లడించారు. ఇక వారికీ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే వరకు కూడా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని ఆరోగ్య సంస్థలు తెలియజేస్తున్నాయి.
అయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మీరు పబ్లిక్‌లో ఉండే విధానం బట్టి మీ పిల్లల ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది అని అన్నారు. అంతేకాదు.. మీరు బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం, శుభ్రంగా ఉండడం ఇలాంటి కనీస జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఇక ఇంటికి రాగానే మీ పిల్లలని ముట్టుకోకుండా చేతులు కాళ్ళు కడుక్కుని అప్పుడు మాత్రమే మీ పిల్లల దగ్గరికి వెళ్లాలని సూచిస్తున్నారు. అంతేకాదు.. మీ ఆరోగ్యం బాగోక పోతే మీ పిల్లల నుంచి దూరంగా ఉండాలని చెబుతున్నారు. అలాగే  మీ ఆరోగ్యం బాగోకపోతే ఇంట్లో కూడా మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు.
కాగా.. కరోనా వైరస్ వల్ల ఇప్పటికే చాలా మందిలో ఆందోళన నెలకొన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు పిల్లలకి వ్యాక్సిన్ ఇవ్వలేదు కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం అని చెబుతున్నారు. చిన్నపిల్లలు ఇన్ఫెక్షన్ బారిన పడకుండా జాగ్రత్తగా చూసుకోండి అలానే మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్నిఅందించాలన్నారు. ఇక వీలైనంతవరకు సేఫ్‌గా ఉంటూ కరోనా వైరస్ బారిన మీ పిల్లలు పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: