బుడుగు: పిల్లల్లో ఇమ్యూనిటీ పెరగాలంటే..?

N.ANJI
ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇక పెద్దలైనా, పిల్లలైనా వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే రోగ నిరోధక శక్తి మెరుగ్గా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక అప్పుడే ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉంటారని అన్నారు. అయితే, పసిపిల్లలకు ఇమ్యూన్‌ సెల్స్‌ తల్లి పాలద్వారా వస్తాయని అన్నారు. ఇక వయసుకు తగిన వ్యాక్సిన్లు వేయిస్తుంటే, చాలా రకాల ఇన్ఫెక్షన్లనుంచి పిల్లలను కాపాడుకోవచ్చునని అంటున్నారు.
సాధారణంగా తల్లి పాలలోని కొలోస్ట్రమ్‌ పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచుతుందని అన్నారు. ఇక పుట్టినప్పటి నుంచీ కనీసం ఆరు నెలలపాటు తల్లి పాలు తాగితే వాళ్ల రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉంటుందని ఎన్నో అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇక ఖనిజ లవణాలన్నిటిలోకి జింక్‌ పిల్లల ఇమ్యూనిటీ సిస్టమ్‌పై ఎక్కువ ప్రభావం చూపిస్తుందని అన్నారు. జింక్ బీన్స్‌, నట్స్‌ వంటి ప్రొటీన్‌ ఫుడ్స్‌లో పుష్కలంగా లభిస్తాయి.
అలాగే పిల్లలకు తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలని పెట్టాలన్నారు. వాటిలో యాంటీ ఆక్సిడెంట్స్‌ కణాలను పాడవకుండా కాపాడుతాయి. వ్యాధుల బారినుంచి రక్షిస్తాయని తెలిపారు. ఇక బెర్రీస్‌, బ్రొకోలీ, పాలకూర, ఆవాల ఆకులు (మస్టర్డ్‌ లీవ్స్‌) మొదలైన వాటిలో యాంటీ ఆక్సిడెంట్స్‌ చాలా ఉంటాయని అన్నారు.
ఇక పిల్లలకి గట్‌ హెల్త్‌ కూడా చాలా ముఖ్యం. జీర్ణ వ్యవస్థ పనితీరు బాగుంటేనే ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయని తెలిపారు. అంతేకాదు.. శరీరంలో మంచి బ్యాక్టీరియా పెరగాలన్నా, పేగు మార్గాలు దృఢంగా ఉండాలన్నా ప్రోబయాటిక్స్‌ పుష్కలంగా ఉండే ఆహారం పిల్లలకు ఇవ్వాలని తెలిపారు. ఇక రోజూ పెరుగుతోపాటు ఒక పండు కచ్చితంగా పెట్టాలని తెలిపారు. అలాగే పెద్ద పిల్లలైతే పెరుగులో క్యారెట్‌, కీరా తరుగు వేసి ఇస్తే ఇష్టంగా తింటారని అన్నారు.
అంతేకాదు.. పిల్లలకు రోజూ 10నుంచి 14 గంటల నిద్ర అవసరం అని అన్నారు. అదికూడా మధ్యలో ఎలాంటి ఆటంకం లేకుండా ఉండాలి. రోజు పిల్లలను రాత్రికి నిద్ర పుచ్చే ముందు గోరు వెచ్చని నీళ్లతో స్నానం చేయించడం, లైట్‌గా మసాజ్‌ చేయడం, కొంతసేపు పుస్తకం చదివించడం వంటివి చేయాలన్నారు. ఇక సరిపడా నిద్రపోయే పిల్లలు అంత త్వరగా ఇన్ఫెక్షన్ల బారినపడకుండా ఉంటారని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: