బుడుగు: శీతాకాలంలో పిల్లలకు ఈ ఆహారం పెడితే ముప్పే..!?

N.ANJI
శీతాకాలంలో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ శీతాకాలంలో చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అంత సీజనల్ వ్యాధుల బారినపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సీజన్లో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న గొంతు నొప్పి, జలుబు, ఫ్లూ, న్యుమోనియా, కడుపు నొప్పి, తీవ్రమైన చెవి ఇన్ఫెక్షన్, చర్మ సమస్యలు, ఆస్తమా వంటి అనారోగ్య సమస్యలు తరచుగా వస్తుంటాయి. అయితే  మీ పిల్లలు సీజనల్ వ్యాధుల భారీన పడకుండా ఉండాలంటే వారికి పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారం ఇవ్వడం, ఒత్తిడిగి గురి చేయకుండా విశ్రాంతి ఇవ్వడం చాలా ముఖ్యం. మీ పిల్లలను అనారోగ్య పాలు చేసే ఈ 5 ఆహారాల నుండి సాధ్యమైనంత దూరంగా ఉంచండి.

అయితే జంతువుల నుండి ఉత్పత్తి చేసే వెన్న, ఒమేగా, కొవ్వు, నూనె శ్లేష్మం మొదలైనవి లాలాజలం గట్టిపడటానికి కారణమవుతాయి. అందువల్ల, శీతాకాలంలో జిడ్డుగల ఆహారాన్ని నివారించడం మంచిది. శీతాకాలం లేదా వేసవి సీజన్లలో చక్కెరను ఎక్కువగా వాడటం మీ పిల్లలకు హానిచేస్తుంది. శీతాకాలంలో మీ పిల్లలకు సోడా, శీతల పానీయాలు, చక్కెర ఉత్పత్తులు, చాక్లెట్లు, బాగా శుద్ధి చేసిన అల్పాహారం, తృణధాన్యాలు, ప్రాసెస్ చేసిన ఆహారాన్ని ఎక్కువగా పెట్టకూడదు.

ఇక శీతాకాలంలో హిస్టామిన్ ఎక్కువగా ఉండే ఆహారాలు తినడం అనేది శ్లేష్మం ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది.  హిస్టామిన్ ఎక్కువగా టమోటాలు, వంకాయ, పుట్టగొడుగుల వినెగార్, మజ్జిగ, పచ్చళ్లు, పులియబెట్టిన ఆహారాలు, కృత్రిమ ఆహారాల్లో లభిస్తుంది. పాల ఉత్పత్తులు అన్ని జంతు ప్రోటీన్లు లాలాజలం, శ్లేష్మం గట్టిపడటానికి కారణమవుతాయి. దీని వల్ల పిల్లల్లో ఆహారం మింగడం కష్టతరం అవుతుంది. అందువల్ల, మీ పిల్లలకు జున్ను, క్రీమ్, క్రీమ్ ఆధారిత సూప్‌లు వంటివి పిల్లలకు పెట్టకూడదు. మాంసంలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయన్న విషయం తెలిసిందే. ప్రాసెస్ చేసిన మాంసాలు, గుడ్డు తీసుకోవడం ద్వారా గొంతు సమస్యలు వస్తాయి. మీరు మీ పిల్లలకు మాంసం తినిపించాలనుకుంటే చేపలు, సేంద్రీయ మాంసం తినిపించడం మంచిది అని నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: