బుడుగు : పిల్లలలో పోషకాహార లోపాన్ని గుర్తించండి ఇలా.. !!

Suma Kallamadi
చాలామంది పిల్లలు ఎదుర్కునే ప్రధాన సమస్యల్లో పోషకాహార లేమి ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా ఐదేళ్ల లోపు వయసున్న పిల్లల్లో 15 కోట్ల మంది పోషకాహార లోపంతో ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కలు చెప్తున్నాయి. పోషకాహార లోపం గల చిన్నారులు బలహీనంగా ఉండటం, ఎదుగుదల లేకపోవటమే కాదు,  వారి పేగుల్లో వివిధ రకాల బ్యాక్టీరియా కూడా అసంపూర్ణంగా, ఎదుగుదల లేకుండా ఉంటుంది. మన శరీరానికి అవసరమైన అన్ని పదార్థాలు అవసరమైన స్థాయిలో శరీరం స్వయంగా తయారు చేసుకోలేదు. వీటిని ఆహారం ద్వారా బైటనుండి శరీరం పొందుతుంది. అలాంటి పదార్థాలను పోషకాలు లేదా న్యూట్రియెంట్స్‌ అంటాము. ఇవి ఆహారంలో లభించ నప్పుడు పోషకాహార లోపం లేదా న్యూట్రియెంట్‌ డెఫి షియెన్సీ ఏర్పడుతుంది. పోషకాలు ప్రధానంగా మూడు రకాలు.అవి – మేజర్‌ న్యూట్రియెంట్స్‌, మాక్రో న్యూట్రియెంట్స్‌, మైక్రో న్యూట్రియెంట్స్‌.

పోషకాహారలోపం అనేది  సరైన పోషకాలు ఉన్న ఆహారం తీసుకోకపోవడం వల్ల కలుగవచ్చు. లేదా కొన్ని వ్యాధుల కారణంగా కాని, కొన్ని సమయాల్లో శరీరానికి అధికంగా పోషకాలు అవసరమైనపుడు కాని, లేదా పోషకాలను సరిగ్గా జీర్ణం చేసుకోలేనప్పుడు కాని , అన్నవాహికనుంచి రక్తంలోకి పోషకాల శోషణ సక్రమంగా జరుగనపపడు కాని సంభవించవచ్చు.పోషకాహార లోపం, మానసిక సమస్యలు పోషకాహార లోపాన్ని పరస్పరం ఉధృతం చేసుకుంటాయి. సహజంగానే బుద్ధిమాంద్యత కలిగిన వారు పోషకాహారలోపంతో బాధపడే అవకాశాలు ఎక్కువ.

వీరి మానసిక సమస్య కొంత ఈ లోపానికి దారి తీస్తోంది. మానసిక సమస్య కారణంగా వారికి ఆహారంపై శ్రద్ధ ఉండకపోవడం దీనికి కారణం. పోషకాహార లోపం ఉన్న పిల్లలకు అరటిపండ్లు, వేరు సెనగలు, సెనగలు వంటి బలవర్ధక ఆహారం ఇవ్వటం వల్ల వారి పేగుల్లో మంచి బ్యాక్టీరియా మెరుగుపడుతుందని, ఇది వారి ఎదుగుదల మొదలవటానికి దోహదపడుతుందని తాజా పరిశోధన చెప్తోంది. ఈ ఆహారం అందించటం వల్ల పిల్లల్లో ఎముకలు, మెదడు, శరీరం ఎదుగుదల ఉండటానికి ఎక్కువ అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: