ఇండియాలో బంగారం దొరికే నది..కోటీశ్వరులు కావడం పక్కా!
జార్ఖండ్ లోని రత్నగర్భ ప్రాంతంలో స్వర్ణరేఖ అనే నది ప్రవహిస్తుంది. ఈ నది ఝార్ఖండ్, పశ్చిమబెంగాల్, ఒడిశాలోని కొన్ని ప్రాంతాల గుండా ప్రవహిస్తుంది. స్వర్ణరేఖ అంటే బంగారపు గీత అని అర్థం. పేరులో ఉన్నట్లుగానే.. ఈ నదిలో బంగారం ప్రవహిస్తుంది. ఈ స్వర్ణరేఖ నది రాంచీకి నైరుతి దిశలో 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగ్డి అనే గ్రామంలోని రాణి చువాన్ అనే ప్రదేశంలో జన్మించి.. ఝార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ మీదుగా ప్రవహించి.. చివరకు బంగాళాఖాతంలో కలుస్తోంది.
ఇక్కడి గిరిజనులు వర్షాకాలం మినహా ఏడాది పొడవునా ఇదే పనిలో నిమగ్నమై ఉంటారని స్థానికలు అంటున్నారు. వీరు బంగారు రేణువులను దక్కించేందుకు నదిలో ఎంతగానో కష్టపడతారు. అయితే ఒక్కోసారి రోజంతా వెతికినా వీరికి ఒక్క బంగారు రేణువు కూడా దొరకదు. అలాంటప్పుడు వట్టి చేతులతోనే ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. బంగారం నది పక్కనే ఉన్నా ఇక్కడి ప్రజల స్థితిగతులు మాత్రమే ఇప్పటికీ ఏమీ మారలేదు. మార్కెట్లో ఒక గ్రాము బంగారం ధర 7వేల దాకా ఉంది. కానీ ఇక్కడ స్థానికులు వారు సేకరించిన బంగారాన్ని చాలా తక్కువ ధరకే అమ్ముకుంటున్నారు. అందువల్ల వారి జీవితాల్లో మార్పులేమీ లేవు.