మహాభారతం రాసి ముస్లిం ఎవరో తెలుసా?

Chakravarthi Kalyan
హిందువులు తమ మత గ్రంథాలను ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఆ మాటకొస్తే ఏ మతస్తుడైనా తమ మత గ్రంథాలను గౌరవిస్తూ ఉంటారు. రామాయణ, మహా భారతాల లోని  సారాన్ని అర్థం చేసుకొని ఆ నీతిని నిత్యజీవితంలో అనుసరిస్తూ ఉంటారు హిందువులు. వాళ్లకు శ్రీరాముడు ఆదర్శప్రాయుడు, శ్రీకృష్ణుడు జగద్గురువు. రాజకీయ నాయకులందరూ కూడా చాలావరకు అందరి మతాలనూ గౌరవిస్తారు.


అయితే కొంతమంది మాత్రం  ఏదో ఒక మతాన్ని పని కట్టుకుని విమర్శించడం చేస్తూ ఉంటారు.  దానికి రెండు కారణాలు ఉండొచ్చు. ఒకటి వాళ్లకి నిజంగానే ఆయా మతాలపై సదాభిప్రాయం ఉండకపోవచ్చు. లేదంటే వాళ్లు ఫేమస్ అవ్వడానికి ఈ రకంగా మాట్లాడుతూ ఉండవచ్చు. తాజాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి  మమతా బెనర్జీ మహాభారతాన్ని ముస్లిమ్ రచయిత వ్రాశారని చెప్పుకొస్తుందట.


అసలు మహాభారతాన్ని  రచించింది వేద వ్యాసుడని మనకి తెలుసు. మమతా బెనర్జీ మాత్రం మహాభారతాన్ని కాజీ నజ్రుల్ ఇస్లాం రచించారని చెప్పడం విచిత్రం. గతంలో భారత్ ప్రయోగించిన చంద్రయాన్-3 విజయవంతం అయిన సందర్భంగా కూడా దీదీ ఇదేవిధంగా  విచిత్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రుడిపై మొదటిసారి కాలమోపిన రాకేష్  రోషన్ ను ఇందిరాగాంధీ అక్కడికి వెళ్లి కలవడం జరిగిందని ఆవిడ చెప్పుకొచ్చారు.


మొదటిసారి చంద్రుడిపై కాలు మోపిన వ్యక్తి రాకేష్ శర్మ అయితే  మమతా బెనర్జీ మాత్రం రాకేష్ రోషన్ అని పేర్కొనడం విచిత్రం. రాకేష్  రోషన్ అంటే ప్రముఖ నిర్మాత, దర్శకుడు మాత్రమే కాక బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తండ్రి. అయితే అంత రాజకీయ పరిణితి అనుభవం ఉన్నమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. "> మమతా బెనర్జీ కి ఒక ఆస్ట్రోనాట్‌కు, సినీ పర్సనాలిటీకి మద్య గల తేడా తెలియకపోవడం  విడ్డూరం. అంతే కాక ఇందిరా గాంధీ  చంద్రుడు పైకి వెళ్లి రాకేష్ రోషన్ ని భారత్ ఎలా కనిపించింది అని అడిగితే ఆయన సారే జహాసే అచ్చా అని అన్నారని అర్ధం లేని వ్యాఖ్యలు చేస్తుంది ఆవిడ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: