చరిత్రలో ఈ రోజు జరిగిన సంఘటనల విషయానికి వస్తే..
1972 వ సంవత్సరంలో 20వ వేసవి ఒలింపిక్ క్రీడలు మ్యూనిచ్ లో ప్రారంభమవ్వడం జరిగింది.
1982 వ సంవత్సరంలో భారతదేశములోని మొట్టమొదటి స్వార్వత్రిక విశ్వవిద్యాలయము ప్రారంభించడం జరిగింది.డా.బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయము, హైదరాబాదు లో ప్రారంభించబడటం జరిగింది.
2008 వ సంవత్సరంలో తెలుగు సినిమా నటుడు చిరంజీవి, ప్రజారాజ్యం పార్టీని స్థాపించడం జరిగింది.
చరిత్రలో ప్రతి రోజుకి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇక అవేంటో ఆ రోజులకు వున్న ప్రత్యేకత ఏంటో తెలుసుకోండి.చరిత్రలో ఈ రోజు జరిగిన జాననాల విషయానికి వస్తే..
1451 వ సంవత్సరంలో క్రిష్టొఫర్ కొలంబస్ జన్మించారు. ఈయన అమెరికా ఖండాన్ని కనుగొన్న వ్యక్తి.
1743 వ సంవత్సరంలో ఆంటోనీ లెవోషియర్ జన్మించారు. ఈయన ఫ్రెంచి రసాయన శాస్త్రవేత్త.
1873 వ సంవత్సరంలో లీ డి ఫారెస్ట్ జన్మించారు. ఈయన తెర మీది బొమ్మకు తగ్గట్లుగా శబ్దాన్ని జత చేసే 'ఫోనో ఫిల్మ్' ప్రక్రియను కనుకున్న అమెరికన్ ఆవిష్కర్త.
1906 వ సంవత్సరంలో ఆల్బర్ట్ బ్రూస్ సాబిన్ జన్మించారు. ఈయన పోలియో వ్యాధికి టీకా మందును కనుగొన్న వైద్యుడు.
1910 వ సంవత్సరంలో మదర్ థెరీసా జన్మించారు. ఈమె రోమన్ కేథలిక్ సన్యాసిని ఇంకా మానవతావాది అలాగే నోబెల్ శాంతి బహుమతి గ్రహీత.
1920 వ సంవత్సరంలో ఏల్చూరి సుబ్రహ్మణ్యం జన్మించారు. ఈయన కవి, రచయిత ఇంకా పాత్రికేయుడు.
1956 వ సంవత్సరంలో మేనకా గాంధీ జన్మించారు. ఈమె నరేంద్ర మోడీ ప్రభుత్వంలో మహిళ ఇంకా శిశు సంక్షేమ శాఖ కేంద్ర మంత్రిణి.
1963 వ సంవత్సరంలో వాడపల్లి వెంకటేశ్వరరావు జన్మించారు. ఈయన దౌత్యవేత్త ఇంకా కీర్తిచక్ర పొందిన మొట్టమొదటి సైనికేతర పౌరుడు.
1964 వ సంవత్సరంలో సురేష్ జన్మించారు. ఈయన తెలుగు సినీ నటుడు.
1965 వ సంవత్సరంలో వాసిరెడ్డి వేణుగోపాల్ జన్మించారు. ఈయన సీనియర్ పాత్రికేయుడు ఇంకా రచయిత.
1968 వ సంవత్సరంలో సౌందర్య రాజేష్ జన్మించారు. ఈమె మహిళా పారిశ్రామికవేత్త.