జులై 28: చరిత్రలో ఈ రోజు ముఖ్య సంఘటనలు...

Purushottham Vinay
ఇక చరిత్రలో ఈ రోజు అనగా జులై 28 వ తేదీన జరిగిన ముఖ్య సంఘటనల విషయానికి వస్తే..ఇక 1979 వ సంవత్సరంలో భారతదేశ 6వ ప్రధానమంత్రిగా చరణ్ సింగ్ ప్రమాణస్వీకారం చేయడం జరిగింది.ఇక అలాగే 2007 వ సంవత్సరంలో ఇళ్ళ స్థలాల కోసం వామపక్షాలు చేసిన ఉద్యమంలో భాగంగా జరిగిన ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్త బందులో ఖమ్మం జిల్లాకు చెందిన ముదిగొండలో పోలీసు కాల్పులు జరిగి ఏడుగురు మరణించడం జరిగింది.ఇక ఈ సంఘటన దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం కలిగించడం జరిగింది.ఇక చరిత్రలో ఈరోజు జరిగిన జాననాల విషయానికి వస్తే..1909 వ సంవత్సరంలో కాసు బ్రహ్మానందరెడ్డి జన్మించడం జరిగింది. ఈయన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.అలాగే 1956 వ సంవత్సరంలో దీవి శ్రీనివాస దీక్షితులు జన్మించారు. ఈయన రంగస్థల నటుడు ఇంకా అధ్యాపకుడు.ఇక 1962 వ సంవత్సరంలో కృష్ణవంశీ జన్మించాడు. ఈయన తెలుగు సినిమా దర్శకుడు.

ఇక 1972 వ సంవత్సరంలో చారు మజుందార్ మరణించాడు. ఈయన నక్సల్బరీ ఉద్యమ నేత.1976 వ సంవత్సరంలో తరిమెల నాగిరెడ్డి మరణించాడు. ఈయన కమ్యూనిస్టు నాయకుడు.ఇక 1976 వ సంవత్సరంలో శ్రీనివాస చక్రవర్తి మరణించారు. ఈయన అభ్యుదయ రచయిత, నాటక విమర్శకుడు ఇంకా నాటక విద్యాలయ ప్రధానాచార్యుడు, పత్రికా రచయిత, వ్యాసకర్త ఇంకా అనువాదకుడు.ఇక 2004 వ సంవత్సరంలో ఫ్రాన్సిస్ క్రిక్ మరణించారు. ఈయన డీ.ఎన్.ఏ స్వరూపాన్ని కనుగొన్న సహశాస్త్రవేత్త.2009 వ సంవత్సరంలో లీలా నాయుడు మరణించారు. ఈమె ప్రముఖ నటీమణి ఇంకా ప్రపంచ సుందరి.ఇక 2016 వ సంవత్సరంలో మహా శ్వేతాదేవి మరణించారు. వీరు నవలా రచయిత అలాగే మంచి సామాజిక కార్యకర్త.ఇక 2019 వ సంవత్సరంలో సూదిని జైపాల్ రెడ్డి మరణించారు. ఈయన రాజకీయ నాయకుడు ఇంకా పార్లమెంటు సభ్యుడు అలాగే మాజీ కేంద్ర మంత్రి.ఇక ఈ రోజు ప్రత్యేకత గురించి చెప్పాలంటే ఈ రోజుని ప్రపంచ కాలేయ వ్యాధి దినోత్సవంగా జరుపుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: