అప్పటి ఎదులపురమే.. ఇప్పటి హుజురాబాద్..!
హుజురాబాద్ శివారు ప్రాంతంలోని రంగనాయకుల పర్వతం పరిసర ప్రాంతాలలో నవీన శిలా యుగం నుండి ప్రారంభమై శాతవాహనుల ఏలిన తర్వాత ఉన్నటువంటి అనేక చారిత్రక ఆధారాలను ఆయన బయట పెట్టేసారు. పూర్వం ఎదులాపురం గ్రామం రంగనాయకుల గుట్ట చుట్టూ ఉండేదని, 80 ఎకరాల పాటిమీద అని పిలుచుకునే ఎత్తైన మట్టి దిబ్బ అక్కడ ఉండేదని, ఇంత విశాలంగా ఉండేటువంటి పాటిగడ్డలు చాలా అరుదుగా కనిపిస్తాయని, ఆయన అన్నారు. ఒకప్పుడు ఈ యొక్క ప్రదేశంలో అన్ని కులాల వారు కలిసి జీవించిన ఆ పెద్ద గ్రామంగా చెప్పుకోవచ్చని ఈ ఆనావాళ్ళని చూస్తే అర్థం అవుతుంది అన్నారు. పాటిమీద పెద్దపెద్ద ఇటుకలతో నిర్మాణాలు చేశారని, గుణ పెంకులు కూడా ఉపయోగించారని, అలాగే తేలికైన ఇటుకలు కూడా దర్శనమిస్తున్నాయని, హనుమాన్ విగ్రహం పక్కనే ఉన్నటువంటి పొలంలో ఒక వీరుడు విగ్రహం ఉందని కాకతీయుల పాలన కాలంలో ఆ వీరుని ఆరాధించేవారని, ఇలా అనేక ఆనవాళ్ళు ఇక్కడ దర్శనమిస్తాయని అన్నారు. పురావస్తుశాఖ ఈ స్థలంలో తవ్వకాలు జరిపినట్లు అయితే అనేక చారిత్రక విషయాలు బయటపడే అవకాశం ఉన్నదని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.