July14: చరిత్రలో ఈ రోజు జరిగిన సంఘటనలు, విశేషాలు...

Purushottham Vinay
ఇక 2015 సంవత్సరంలో గోదావరి నది పుష్కరాల ప్రారంభదినం సందర్భంగా రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద గోదావరి నదిలో పుణ్య స్నానాలను చేయడానికి వచ్చిన జనాలలో జరిగిన త్రొక్కిసలాటలో మొత్తం 27 మంది చనిపోయారు.ఈ సంఘటన ఎంతో విషాదకరమైనది.ఇక 1794 వ సంవత్సరంలో మైసూరు మహారాజా ముమ్మడి కృష్ణరాజ్ వడయార్ జన్మించారు.ఇక ఈయన్ని టిప్పు సుల్తాన్ మరణానంతరం బ్రిటీష్ సైన్యం మైసూర్ ను ఒక రాచరిక రాష్ట్రం (ప్రిన్స్‌లీ స్టేట్) గా మార్చి 5 ఏళ్ల వయసులో మహారాజుగా నియమించడం జరిగింది.ఇక 1857 వ సంవత్సరంలో మేటాగ్ అనే శాస్త్రవేత్త జన్మించారు. ఈయన వాషింగ్ మెషిన్ (బట్టలు ఉతికే యంత్రం) ని కనిపెట్టిన శాస్త్రవేత్త.

1860 వ సంవత్సరంలో పూండ్ల రామకృష్ణయ్య అనే తెలుగు పండితుడు ఇంకా విమర్శకుడు జన్మించారు.ఇక 1862 వ సంవత్సరంలో ఫ్లోరెన్స్ బాస్కం జన్మించారు. ఇక ఈమె మొట్టమొదటి పి.హెచ్‌డి పొందిన అమెరికన్ మహిళ.అలాగే 1893 వ సంవత్సరంలో గరిమెళ్ళ సత్యనారాయణ జన్మించారు. ఈయన ఒక స్వాతంత్ర్య సమరయోధుడు అలాగే మంచి కవి ఇంకా మంచి రచయిత కూడా.1904 వ సంవత్సరంలో వెంపటి సూర్యనారాయణ అనే ప్రజావైద్యుడు ఇంకా గాంధేయవాది జన్మించారు.1918 వ సంవత్సరంలో ఇంగ్మార్ బెర్గ్మాన్ అనే స్వీడిష్  దర్శకుడు జన్మించాడు.ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించాడు.1920 వ సంవత్సరంలో శంకర్‌రావు చవాన్ జన్మించారు. ఈయన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.

1947 వ సంవత్సరంలో గుండా మల్లేష్ అనే కమ్యూనిస్టు నేత అలాగే శాసనసభ మాజీ సభ్యుడు జన్మించాడు.ఇక 1950 వ సంవత్సరంలో గ్రంధి మల్లికార్జున రావు అనే వ్యాపారవేత్త జన్మించాడు.అలాగే 1956 వ సంవత్సరంలో తనికెళ్ళ భరణి జన్మించాడు. ఈయన అందరికి తెలిసిన మంచి రంగస్థల, సినిమా రచయిత ఇంకా మంచి నటుడు.ఇక 1959 వ సంవత్సరంలో చాగంటి కోటేశ్వరరావు జన్మించారు. ఈయన అనితర సాధ్యమైన ధారణ పటిమతో అనర్గళమైన ప్రవచనములకు ఆయనకు ఆయనే సాటి.ఇక 1975 వ సంవత్సరంలో పంకజ్ భడౌరియా జన్మించారు.ఇక ఈయన 2010లో జరిగిన మాస్టర్ షెఫ్ ఇండియా మొదటి సీజన్ విజేత.ఇక 1958 వ సంవత్సరంలో కింగ్ ఫైజల్ II మరణించాడు. ఈయన ఇరాక్ రాజు.2015 వ సంవత్సరంలో ఎమ్మెస్ విశ్వనాథన్ మరణించారు. ఈయన దక్షిణ భారతదేశానికి చెందిన సంగీత దర్శకుడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: