సెప్టెంబర్ 28వ తేదీకి చరిత్రలో ఎంతో ప్రాధాన్యం.. విశేషాలేంటో తెలుసా..?
ముఖ్య సంఘటనలు
1745: బ్రిటన్ జాతీయ గీతం 'గాడ్ సేవ్ ది కింగ్' మొదటిసారిగా పాడిన రోజు.
1908: మూసీ నది వరదల వల్ల హైదరాబాదులో భారీగా ఆస్తినష్టం జరిగింది.
2008: అమెరికా ప్రతినిధుల సభ భారత్-అమెరికా అణుఒప్పందపు బిల్లును ఆమోదించింది.
2013: పాలమూరు (మహబూబ్నగర్) పట్టణంలో సుష్మాస్వరాజ్ యొక్క భారీ "తెలంగాణ ప్రజాగర్జన" బహిరంగ సభ నిర్వహించబడింది.
ప్రముఖుల జననాలు
1835: షిర్డీ సాయిబాబా, భారతీయ గురువు, సాధువు, ఫకీరు. (మ.1918)
1895: గుర్రం జాషువా, ప తెలుగు కవి. (మ.1971)
1907: భగత్ సింగ్, భారత జాతీయోద్యమ నాయకుడు. (మ.1931)
1909: పైడి జైరాజ్, భారత సినీరంగ నటుడు, నిర్మాత, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. (మ.2000)
1915: స్థానాపతి రుక్మిణమ్మ, సంస్కృతాంధ్ర పండితురాలు, రచయిత్రి.
1929: లతా మంగేష్కర్, గాన కోకిల.
1987: హిల్లరీ డఫ్, అమెరికా నటి, రికార్డింగ్ కళాకారిణి.
ప్రముఖుల మరణాలు
1895: లూయీ పాశ్చర్, ప్రఖ్యాత ఫ్రెంచి జీవశాస్త్రవేత్త. (జ.1822)
1968: కూర్మాపు నరసింహం, చిత్రకారుడు.కూర్మాపు నరసింహం మంచి చిత్రకారుడు . కుంచెతో కోటి భావాలు పలికించగల మహా వ్యక్తి . వర్ణ చిత్రాలతో శ్రీకాకుళం జిల్లా కీర్తిని జాతీయ స్థాయిలో ఇనుమడింపజేసిన విశిష్ట ప్రతిభా వంతుడు .
శ్రీకాకుళం పట్నంలో చిన్నబజారులో ఉన్న నాగేశ్వరరావు ఫోటో స్టుడియోలో ఎన్నో చిత్ర కళా ఖండాలు ఆయన వేసినవే . శ్రీశైలం భ్రమరాంబిక ఆలయంలో నరసింహం గీసిన " ఛత్రపతి శివాజీ కి వీరఖడ్గం అందిస్తున్న భ్రమరాంభికాదేవి " చిత్రపటాన్ని తిలకించిన అప్పటి ప్రధాని ' జవహర్ లాల్ నెహ్రూ ' ఈ చిత్ర కారుడుని నేను చూడాలని ఉంది అన్నారంటే నరసింహం భావం ఎంత ఉన్నతమైనదో అవగతము కాగలదు . మల్లెపువ్వుల్లాంటి నేత చీరల్లో అంతుపట్టని హావభావాలతో రంగుదాల్చిన ముగ్ద మనోహరిని ' సుందరమూగా చిత్రీకరించారు . మహాత్ముడు దూసి గ్రామానికి వచ్చినప్పుడు గాంధీజీ నిలువెత్తు చిత్రాన్ని గీసి ఇచ్చి ఆయన ప్రశంసలు పొందేరు . కూర్మాపు చిత్రించిన " బుద్దుని క్షీరనివేదనమ్ " బొమ్మను జపాన్ బౌద్ధ అధ్యయన బృందము చూసి ప్రశంసించి నరసింహం చిత్రపటానికి సాష్టాంగ నమస్కారము చేసారు .
1973: ఆదిరాజు వీరభద్రరావు, తెలంగాణ ప్రాంతపు చరిత్ర, సంస్కృతిపై విశేష పరిశోధన చేసిన గొప్ప భాషా శాస్త్రవేత్త. (జ.1890)
1980: రావాడ సత్యనారాయణ, తెలంగాణ రాష్ట్రానికి చెందిన భౌతిక శాస్త్రవేత్త, ఉస్మానియా విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్సలర్. (జ.1911)
1994: వెల్దుర్తి మాణిక్యరావు, నిజాం వ్యతిరేక పోరాటయోధుడు. (జ.1912)
2004: ముల్క్ రాజ్ ఆనంద్, భారతీయ ఆంగ్ల రచయిత. (జ.1905)
2006: ఎస్.వి.ఎల్.నరసింహారావు, న్యాయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1911)
2007: పీసపాటి నరసింహమూర్తి, రంగస్థల నటుడు. (జ.1920)
పండుగలు , జాతీయ దినాలు
అంతర్జాతీయ సమాచార హక్కుల దినోత్సవం.
గన్నర్స్ డే.