ఏసీ కింద నిద్రపోతున్నారా.. వ్యాధులను కొని తెచ్చుకున్నట్టే..?

Divya
ప్రస్తుతం మారుతున్న జీవనశైలి లోనే మార్పుల వల్ల చాలా మంది తినే ఆహారంతో పాటు నిద్రిస్తున్న సమయంలో కూడా చాలా మార్పులు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది సకాలంలో ఏసీ లేకుండా నిద్రపోవడం చాలా కష్టంగా మారుతున్నది. ఈ అలవాటు చాలా మందికి ఉండనే ఉంటుంది. ప్రతిరోజు కష్టపడి తర్వాత శరీరం కాస్త విశ్రాంతి తీసుకోవడం కోసం చల్లదనం కోసం ఏసీ కింద హాయిగా నిద్రపోతూ ఉంటారు. ఏసి కింద ఎక్కువసేపు పడుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదమో ఇప్పుడు చూద్దాం.

ప్రస్తుతం వర్షాకాలం నడుస్తూ ఉండడం వల్ల.. వర్షాలు పడుతూ ఉండడం వల్ల ఒక్కసారిగా వాతావరణం లో మార్పులు కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి సమయంలో వివిధ రకాల వైరస్లు, బ్యాక్టీరియాలు తీవ్రమైన ప్రభావాన్ని చూపించి జలుబు, జ్వరం, దగ్గు వంటివి వ్యాప్తి చెందేలా చేస్తాయి. అంతేకాకుండా దోమలు కూడా వివిధ రకాల వాతావరణ ప్రాంతం నుంచి వస్తూ ఉంటాయి. వర్షాలు ఎక్కువగా పడడం చేత నీటి ద్వారా కూడా పలు రకాల వ్యాధులు వ్యాప్తి చెందుతూ ఉంటాయి.

ఇలాంటి సమయంలో ఏసీ లేకుండా నిద్రపోనీ వారికి కల్లు పోరి బారడం.. వాతావరణం లో వచ్చేటువంటి తేమ కారణంగా చికాకుగా మంటగా కూడా అనిపిస్తుందట. అలాగే చర్మానికి సంబంధించిన సమస్యలు ఏర్పడతాయట. ఏసి కింద ఉన్నవారు నిరు చాలామంది తక్కువగా తాగుతూ ఉంటారు. కానీ ఇది చాలా తప్పట.. నీరు ఎక్కువగా తాగడం చాలా మంచిదట. దీనివల్ల శరీరం డిహైడ్రేడ్ కాకుండా ఉంటుంది. అలాగే అలర్జీలకు చర్మం పొరలు పొడిబారకుండా ఉండేందుకు బాగా సహాయపడుతుంది. మైగ్రేన్ సమస్యతో ఇబ్బంది పడేవారు ఏసి కింద అసలు పడుకోవడం మంచిది కాదు. దీనివల్ల తలనొప్పి ఎక్కువగా వస్తూ ఉంటుందట. ఏసీలో చిక్కుకున్న దుమ్ము దూళి వల్ల ఊపిరితిత్తులకు చాలా సమస్యలు ఏర్పడతాయి అలాగే అలర్జీ ఆస్తమా వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: