గంటల తరబడి కుర్చీకే అతుక్కుపోతున్నారా.. అయితే ముందే మరణిస్తారట?

praveen
నేటి రోజుల్లో అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ ప్రతి పనిని కూడా ఎంతో సులభతరం చేసింది అన్న విషయం తెలిసిందే.  అయితే ఇలాంటి టెక్నాలజీ అటు మనిషి జీవనశైలిలో కూడా ఎన్నో మార్పులకు కారణమైంది. ఒకప్పుడు ఏ పని చేయాలన్నా చెమటోడ్చి కష్టపడేవాడు మనిషి. కానీ ఇప్పుడు టెక్నాలజీతో అన్ని పనులు ఇక ఒక్క చెమట చుక్క కూడా చిందించకుండానే పూర్తవుతున్నాయి. ఇక నేటి రోజుల్లో చేసే ఉద్యోగాలు అన్నీ కూడా ఒకే చోట కూర్చిలో గంటల తరబడి కూర్చుని చేసే ఉద్యోగాలే కావడం గమనార్హం.

 అయితే మొదట్లో ఇలాంటి ఉద్యోగాలతో బాగా రెస్ట్ దొరుకుతుందని ఇక ఇలాంటి ఉద్యోగం దొరకడం అదృష్టం అని అనుకునేవారు చాలామంది. కానీ ఇక ఒకే చోట గంటల తరబడి కూర్చొని ఎన్నో ఆరోగ్య సమస్యలను మాత్రం కొని తెచ్చుకుంటున్నారు అని చెప్పాలి. ఇక నేటి రోజుల్లో సాఫ్ట్వేర్ రంగం దగ్గర నుంచి సాధారణ ఉద్యోగం వరకు కూడా ప్రతి ఒక్కటి కూడా ఇలా ఎలాంటి శారీరక శ్రమ లేకుండా.. ఒకే చోట కూర్చుని చేసే ఉద్యోగం చేస్తున్నారు. అయితే ఇలా ఒకే చోట గంటల తరబడి కూర్చోవడం మాత్రం ఏకంగా ప్రాణాలకే ప్రమాదం అంటూ నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు అని చెప్పాలి.

 అయితే ఆఫీసులో గంటలపాటు ఒకవేళ కూర్చికే అతుక్కుపోతున్నారు అంటే మీరు మిగతా వాళ్లతో పోల్చి చూస్తే కాస్త తొందరగానే మరణించే అవకాశం ఉందట. దాదాపుగా 16% మంది ఇలా ముందే మరణించే అవకాశం ఉందని తైవాన్ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. గంటలపాటు ఒకే చోట కుర్చీలో కూర్చుంటే కొలెస్ట్రాల్, ఒబాసిటీ, షుగర్ వంటి అనారోగ్య సమస్యలు వస్తాయట. కనీసం గంటకు ఓసారైనా పది నిమిషాల పాటు కుర్చీ నుంచి దూరం గా ఉంటే బెటర్ అంటూ సూచిస్తున్నారు పరిశోధకులు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులో ఎనిమిది గంటలకంటే ఎక్కువగా కూర్చోవడం ఎంతో ప్రమాదకరం అంటూ హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: