మనం చాలా ఈజీగా చేసుకోదగిన వివిధ రకాల రైస్ వెరైటీలల్లో పుదీనా రైస్ కూడా ఒకటి. పుదీనా రైస్ చాలా రుచిగా ఇంకా ఆరోగ్యంగా ఉంటుంది. లంచ్ బాక్స్ లోకి అలాగే సమయం తక్కువగా ఉన్నప్పుడు చేసుకోవడానికి ఇది చాలా ఈజీగా ఉంటుంది.దీనిని చాలా రకాలుగా తయారు చేస్తూ ఉంటారు. ఇప్పుడు చెప్పే విధంగా తయారు చేసే పుదీనా రైస్ చాలా రుచిగా ఆరోగ్యంగా ఉంటుంది. దీనిని అందరూ ఖచ్చితంగా ఇష్టపడతారు. ఎంతో రుచిగా ఉండే ఈ పుదీనా రైస్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పుదీనా రైస్ తయారీకి కావల్సిన పదార్థాల విషయానికి వస్తే..అన్నం ఒకటిన్నర కప్పు, పుదీనా చిన్నవి రెండు, కొత్తిమీర గుప్పెడు, పచ్చిమిర్చి 3, దాల్చిన చెక్క అర ఇంచు ముక్క, లవంగాలు 4, వెల్లుల్లి రెబ్బలు 8, అల్లం ఒక ఇంచు ముక్క, నూనె 2 టేబుల్ స్పూన్స్, బిర్యానీఆకు 1, పల్లీలు గుప్పెడు, జీడిపప్పు కొద్దిగా, తాళింపు దినుసులు ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 2, తరిగిన పచ్చిమిర్చి 2, కరివేపాకు ఒక రెమ్మ, ఉప్పు తగినంత తీసుకోవాలి.
పుదీనా రైస్ తయారీ విధానం విషయానికి వస్తే..ముందుగా జార్ లో పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, దాల్చిన చెక్క, లవంగాలు, అల్లం ఇంకా వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఆ తరువాత కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనెని వేసి వేడి చేయాలి. ఆ తరువాత బిర్యానీ ఆకు, పల్లీలు వేసి వేయించాలి. తరువాత జీడిపప్పు కూడా వేసి వేయించాలి. తరువాత తాళింపు దినుసులు, ఎండుమిర్చి ఇంకా పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత కరివేపాకు కూడా వేసి వేయించాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఇంకా ఉప్పు వేసి వేయించాలి. దీనిని పచ్చి వాసన పోయే దాకా చక్కగా వేయించిన తరువాత అన్నం వేసి కలపాలి. ఇక దీనిని అంతా కలిసేలా కలుపుకున్న తరువాత మూత పెట్టి ఒక నిమిషం పాటు అలాగే ఉంచాలి. తరువాత స్టవ్ ని ఆఫ్ చేసి వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది.