ఈ రోజుల్లో చాలా మంది కూడా నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఎక్కువగా ఈ సమస్య బారిన పడుతున్నారు.నిద్రలేమి సమస్య తలెత్తడానికి చాలా కారణాలు ఉంటాయి. ఒత్తిడి, ఆందోళన, శరీరానికి తగినంత శ్రమ లేకపోవడం ఇంకా శరీరంలో ఉండే వివిధ అనారోగ్య సమస్యలు వంటి రకరకాల కారణాల వలన నిద్రలేమి సమస్య వస్తూ ఉంటుంది.ఈ నిద్రలేమి సమస్యను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ఇక మన శరీరానికి ఆహారం, గాలి, నీరు ఎలా అవసరమో నిద్ర కూడా అంతే అవసరం. నిద్రలేమి వల్ల మనం రోజంతా ఉత్సాహంగా పని చేసుకోలేకపోతాము. ఇంకా అలాగే ఎప్పుడూ నీరసంగా, తలనొప్పిగా ఉంటుంది. అందువల్ల ఏ పనిపైనా కూడా శ్రద్ద పెట్టలేకపోతూ ఉంటాము. ఒత్తిడి, కోపం వంటివి చాలా ఎక్కువవుతాయి.ఇంకా అలాగే బీపీ, గుండె సమస్యలు, మెదడుకు సంబంధించిన సమస్యలు వంటి వివిధ అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే నిద్రలేమితో బాధపడే వారు మనకు సులభంగా లభించే పదార్థాలతో ఒక సూపర్ డ్రింక్ ను తయారు చేసుకుని తాగడం వల్ల నిద్రలేమి సమస్య తగ్గుతుంది. ఇంకా అలాగే ఈ డ్రింక్ ను తాగడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలు కూడా ఈజీగా లభిస్తాయి.నిద్రలేమి సమస్యను ఈజీగా తగ్గించే డ్రింక్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రెండు ఆఫ్రికాట్ లను, ఒక అరటిపండును, ఒక స్పూన్ పొద్దు తిరుగుడు గింజలను, ఒక స్పూన్ చియా విత్తనాలను ఇంకా ఒక గ్లాస్ పాలను తీసుకోవాలి.ముందుగా ఒక గిన్నెలో పొద్దు తిరుగుడు గింజలు, చియా విత్తనాలు ఇంకా ఆఫ్రికాట్స్ ను తీసుకోవాలి. ఆ తరువాత ఇవి మునిగే దాకా నీటిని పోసి ఒక గంట పాటు నానబెట్టాలి.ఇక ఇలా నానబెట్టిన తరువాత వీటిని ఒక జార్ లోకి తీసుకోవాలి.ఆ తరువాత ఇందులో పాలు, అరటి పండు ముక్కలు వేసి వాటిని మెత్తగా మిక్సీ పట్టుకుని గాస్ల్ లోకి తీసుకోవాలి.ఇలా తయారు చేసుకున్న డ్రింక్ ను ప్రతి రోజూ రాత్రి నిద్రపోవడానికి అరగంట ముందు తీసుకోవాలి. ఇలా ఈ డ్రింక్ ను తయారు చేసి తీసుకోవడం వల్ల ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు తగ్గి మంచి మానసిక ప్రశాంతత లభిస్తుంది. నిద్ర కూడా చక్కగా పడుతుంది. ఇంకా అదే విధంగా ఈ డ్రింక్ ను ఉదయం పూట తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సినంత శక్తి కూడా లభించి రోజంతా చాలా ఉత్సాహంగా పని చేసుకోవచ్చు.