జీర్ణ శక్తిని పెంచి అధిక బరువుని తగ్గించే ఫుడ్ ఇదే?

Purushottham Vinay
మన ఆరోగ్యానికి ఓట్స్ చాలా మేలు చేస్తాయన్న సంగతి  తెలిసిందే. ఓట్స్ ను తీసుకోవడం వల్ల జీర్ణశక్తి బాగా మెరుగుపడుతుంది. ఇంకా అలాగే మలబద్దకం సమస్య కూడా ఈజీగా తగ్గుతుంది.అలాగే గుండె ఆరోగ్యం చాలా బాగా మెరుగుపడుతుంది. ఇంకా శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇక బరువు తగ్గాలనుకునే వారు ఓట్స్ ను తీసుకోవడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. ఈ ఓట్స్ తో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము.ఈ ఓట్స్ తో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో ఓట్స్ పరాటాలు కూడా ఒకటి.ఓట్స్ తో చేసే పరాటాలు తినడానికి చాలా రుచిగా ఉంటాయి. వీటిని అల్పాహారంగా తీసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు, జీర్ణ సమస్యలు ఉన్న వారు పరాటాలను తీసుకోవడం వల్ల చాలా మంచి ఫలితం ఉంటుంది. ఇక రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందించే ఈ ఓట్స్ పరాటాలను ఎలా తయారు చేసుకోవాలో పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.



ముందుగా మీరు ఒక కళాయిలో ఓట్స్ ను వేసి పచ్చిదనం పోయే దాకా వేయించి జార్ లోకి తీసుకోవాలి. ఆ తరువాత వీటిని బరకగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఆ తరువాత గోధుమపిండితో పాటు మిగిలిన పదార్థాలన్నీ కూడా వేసి బాగా కలుపుకోవాలి.తరువాత తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. తరువాత ఒక టీ స్పూన్ నూనె వేసి బాగా కలుపుకోవాలి. తరువాత దీనిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు పిండిని నానబెట్టుకోవాలి. తరువాత ఆ పిండిని మరోసారి కలుపుకుని ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో ఉండను తీసుకుంటూ గోధుమపిండి చల్లుకుంటూ పరాటాలాగా వత్తుకోవాలి. ఆ తరువాత స్టవ్ మీద పెనాని ఉంచి వేడి చేయాలి. ఆ పెనం వేడయ్యాక పరాటాను వేసి కాల్చుకోవాలి. ఇక దీనిని నేరుగా ఇలాగే కాల్చుకోవచ్చు. లేదంటే కొద్దిగా నెయ్యి లేదా నూనె వేసి కూడా కాల్చుకోవచ్చు. ఈ పరాటాను రెండు వైపులా చక్కగా కాల్చుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.ఇలా చేయడం వల్ల బాగా రుచిగా ఉండే ఓట్స్ పరాటాలు తయారవుతాయి. వీటిని తినడం వల్ల రుచితో పాటు సంపూర్ణ ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: