మెదడు ఆరోగ్యం కోసం ఇది తినండి?

Purushottham Vinay
మెదడు ఆరోగ్యం కోసం ఇది తినండి ?

గుమ్మడిని ఆహారంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఎందుకంటే దీనిలో 92 శాతం నీరు ఉంటుంది. ఇంకా అలాగే 100 గ్రాముల గుమ్మడికాయలో 25 క్యాలరీల శక్తి మాత్రమే ఉంటుంది. అలాగే దీనిని తీసుకోవడం వల్ల జీర్ణశక్తి కూడా బాగా మెరుగుపడుతుంది.అందువల్ల ఇది సులభంగా జీర్ణమవుతుంది.ఈ గుమ్మడికాయతో ఎక్కువగా పులుసును తయారు చేస్తూ ఉంటారు. పులుసు కూరలు వండడానికి చింతపండును ఎక్కువగా ఉపయోగిస్తారు. చింతపండు వేసిన కారణంగా వంటల్లో కారం, ఉప్పు ఇంకా మసాలాలు ఎక్కువగా వేయాల్సి వస్తుంది. ఉప్పుకు వాతం చేసే గుణం ఉందని దీని కారణంగా గుమ్మడికాయను తినడం వల్ల మనకు వాతం చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.అలాగే ఈ ఉప్పుకు అలర్జీ చేసే గుణం కూడా ఉంది.


ఇక గుమ్మడి కాయతో పాటు గుమ్మడి గింజలు తీసుకోవడం వల్ల కూడా మన ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.గుమ్మడిగింజలు దాదాపు జీడిపప్పుతో సమానంగా ఆరోగ్యంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంకా గుమ్మడి గింజల్లో ఉండే పప్పును తీసుకోవడం వల్ల జింక్  కూడా అత్యధికంగా ఉంటుంది.ఇక ఈ గుమ్మడి గింజల పప్పును తీసుకోవడం వల్ల మెదడు ఆరోగ్యం కూడా బాగా మెరుగుపడుతుంది. తెలివితేటలు, జ్ఞాపక శక్తి పెరగడంతో పాటు వృద్దాప్యంలో మతిమరుపు ఇంకా అల్జీమర్స్ వంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. అలాగే ఈ పప్పును తీసుకోవడం వల్ల ఆలోచనా శక్తి పెరగడంతో పాటు శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది. మెదడు ఆరోగ్యం కోసం ఇది తినండి..ఈ విధంగా గుమ్మడి కాయతో పాటు గుమ్మడి గింజల పప్పు కూడా మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని అందుకే వీటిని తప్పకుండా ఆహారంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: