సలాడ్ లో ఈ పచ్చి కూరగాయలు వాడుతున్నారా..?

Divya
ఈ మధ్యకాలంలో డైట్ ఫాలో అయ్యేవారు ఎక్కువగా పచ్చి కూరగాయలను,ఫ్రూట్స్ ని సలాడ్ రూపంలో తీసుకుంటూ ఉంటారు.వాటిలోని ఫైబర్ తొందరగా సన్నబడటానికి ఉపయోగపడుతుందని, మరియు అనేక అనారోగ్య సమస్యలు తొలగిస్తుందని పచ్చి కూరగాయలనే తినడం బాగా అలవాటైపోయింది.కానీ కొన్ని రకాల కూరగాయలను పచ్చిగా తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యల తలెత్తుతాయని,ముఖ్యంగా రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్న పిల్లలు,గర్భిణీ స్త్రీలు,బిడ్డకు పాలిచ్చే తల్లులు,వయసు 60 దాటిన పెద్దలు ఇలాంటి పచ్చి కాయగూరలు తినకపోవడం చాలా మంచిదని వైద్యులు చెబుతున్నారు.అవేంటో ఇప్పుడు తెలుసుకుందామా..

ఆకుకూరలు..
ఆకుకూరలు అధిక న్యూట్రియాంట్స్ ఉన్న ఆహారం అయినప్పటికీ,వాటిని ఉడకబెట్టకుండా తినడం అస్సలు మంచిది కాదని పోషకాహర నిపుణులు హెచ్చరిస్తున్నారు.కావున సలాడ్స్ వంటివి తినేటప్పుడు వుండికించిన ఆకుకూరలు తినడం చాలా మంచిది. పచ్చిఆకుకూరల్లో శరీరానికి హాని కలిగించే ఆక్సలేట్ అధికంగా ఉంటుంది.ఆకుకూరలను ఉడకబెట్టినప్పుడు దాని తీవ్రత తగ్గుతుంది.

క్రూసిఫెరస్..
క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బ్రకోలీ వంటి వాటిని క్రూసిఫెరస్ అంటారు. వీటిని ఉడకబెట్టకుండా తీసుకుంటే జీర్ణ వ్యవస్థ మందగిస్తుంది. దీనితో జీర్ణ సంబంధిత సమస్యలైన గ్యాస్,మలబద్ధకం,అసిడిటీ వంటి సమస్యలు తలెత్తుతాయి.

పాలు..
పచ్చిపాలలో హానికరమైన బ్యాక్టీరియా ఫామ్ అయి ఉంటుంది.ఈ పాలను పాశ్చరైజేషన్ చేయడం వల్ల అందులోని బ్యాక్టీరియా అంతం అవుతుంది.ఇలాంటి పాయిశ్చరైజేషన్ చేసిన పాలను మాత్రమే ఉడకపెట్టకుండా తాగవచ్చు.కానీ అప్పుడప్పుడే తీసిన పాలను మాత్రం కచ్చితంగా ఉడకబెట్టుకొని తాగాలి.

గుడ్లు..
కొందరు పచ్చి గుడ్డును పగలగొట్టగానే తాగుతూ ఉంటారు. కానీ అందులోని హానికరమైన బ్యాక్టీరియా ఫంగస్ వంటివి అనేక అనారోగ్య కారణాలు అవుతాయి కావున గుడ్డులోని తెల్లసొన మరియు పచ్చసొన గట్టిపడే వరకు ఉడికించి తీసుకోవడం చాలా మంచిది.

 మొలకెత్తిన విత్తనాలు..
చాలామంది డైట్ పేరుతో మొలకెత్తిన గింజలను అల్పాహారంగా తీసుకుంటూ ఉంటారు.కానీ మొలకెత్తిన గింజల్లో అనేక రకాల ఫంగస్ కారకాలు ఉంటాయి.కావున మొలకెత్తిన గింజలు కూడా ఉడకబెట్టుకొని తినవచ్చు.అయితే ఇందులోని విటమిన్స్ ఉడకపెట్టినప్పుడు తగ్గినా సరే,దాని ప్రత్యామ్నాయంగా నిమ్మరసం వాడటం చాలా ఉత్తమం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: