కీళ్ల నొప్పులు,నరాల బలహీనతలని ఈజీగా పోగొట్టే టిప్?

Purushottham Vinay
పెరుగును, అవిసె గింజల పొడిని ఇంకా పటిక బెల్లం పొడిని తీసుకోవాలి. వాటిని ముందుగా కళాయిలో అవిసె గింజలను వేసి దోరగా వేయించాలి. ఆ తరువాత వీటిని జార్ లో వేసి మెత్తని పొడిలాగా చేసుకోవాలి. తరువా ఇప్పుడు అర కప్పు పెరుగును తీసుకోవాలి. తరువాత ఇందులో రెండు టీ స్పూన్ల అవిసె గింజల పొడిని వేసి బాగా కలపాలి. షుగర్ లేని వారు ఇందులో అర టీ స్పూన్ పటిక బెల్లం పొడిని వేసి కలిపి తీసుకోవాలి. ఇక ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని రోజుకు ఒకసారి తీసుకోవాలి. అధిక బరువు సమస్యతో బాధపడే వారు  దీనిని భోజనానికి 10 నిమిషాల ముందు తీసుకోవాలి. అదే బరువు తక్కువగా ఉండే వారు  భోజనం చేసిన 10 నిమిషాల తరువాత దీనిని తీసుకోవాలి. ఈ విధంగా ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల రక్తనాళాలు బాగా శుభ్రపడతాయి. గుండె ఆరోగ్యం కూడా బాగా మెరుగుపడుతుంది. శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ఈజీగా తొలగిపోతుంది. ఈ విధంగా ఈ టిప్ ని పాటించడం వల్ల రక్తపోటు చాలా ఈజీగా అదుపులో ఉంటుంది.



అలాగే కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. ఇంకా అంతేకాకుండా ఈ టిప్ ని పాటించడం వల్ల జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది. మలబద్దకం సమస్య అనేది అసలు మన దరి చేరకుండా ఉంటుంది. మలబద్దకం సమస్యతో బాధపడే వారు ఈ టిప్ ని రోజూ ఉదయం పాటించాలి. ఇలా చేయడం వల్ల పొట్ట బాగా పూర్తిగా శుభ్రపడుతుంది. పెరుగు, అవిసె గింజలను కలిపి తీసుకోవడం వల్ల మనం తీసుకున్న ఆహారంలో ఉండే పోషకాలు శరీరానికి బాగా అందుతాయి. శరీరంలో మలినాలు, విష పదార్థాలు ఇంకా ఫ్రీ రాడికల్స్ అన్నీ కూడా తొలగిపోతాయి. శరీరంలో వాతం పెరిగిపోవడం వల్ల వచ్చే సమస్యలన్నీ ఈజీగా తగ్గుతాయి. నరాల బలహీనత ఇంకా తిమ్మిర్ల సమస్యతో బాధపడే వారు ఈ టిప్ ని పాటించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ చిట్కాను పాటించడం వల్ల చర్మం ఇంకా జుట్టు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఈ విధంగా అవిసె గింజలను ఇంకా పెరుగును కలిపి తీసుకోవడం వల్ల మనం చాలా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: