హైబీపి తగ్గాలంటే ఈ జ్యూస్ తాగాల్సిందే?

Purushottham Vinay
ప్రస్తుత కాలంలో హైబీపి సమస్య అనేది కామన్. అయితే దానికి మందుల కంటే న్యాచురల్ టిప్స్ తో ఈజీగా చెక్ పెట్టొచ్చు. ఇక దోసకాయ హైబీపి సమస్యకి చాలా మంచిది.ఇది 95 శాతం నీటి కంటెంట్ కలిగిన ఒక సూపర్ ఫుడ్.అందుకే దీన్ని తీసుకోవడం వల్ల మీ శరీరం ఖచ్చితంగా హైడ్రేట్‌గా ఉంటుంది. అందుకే దోసకాయ తింటే నీటి కొరత సమస్య అనేది ఉండదు.దోసకాయ రసం తాగడం వల్ల మీ శరీరం చాలా ఫిట్‌గా ఉంటుంది. ఇంకా అలాగే మీ బరువు కూడా అదుపులో ఉంటుంది. ఇంకా అంతేకాకుండా, దోసకాయ రసం తాగడం వల్ల మీరు అధిక రక్తపోటును కూడా చాలా ఈజీగా అదుపులో ఉంచుకోవచ్చు. ఇంకా అంతే కాదు, దోసకాయ రసం మీ జీర్ణక్రియను కూడా బాగా మెరుగుపరుస్తుంది.ఇక అందువల్ల మీరు అన్ని కడుపు సంబంధిత సమస్యల నుండి దూరంగా ఉండవచ్చు. కాబట్టి కీర దోసకాయ రసంని ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


దోసకాయ రసం తయారు చేయడానికి ముందు మీరు దోసకాయను బాగా కడగాలి. ఆ తర్వాత దాన్ని ముక్కలుగా కోసి విడిగా ఒక డబ్బాలో పెట్టుకోవాలి. దీని తరువాత, చివ్స్, కొత్తిమీర ఆకులు ఇంకా అలాగే పుదీనా ఆకులను కూడా తీసుకొని వాటిని మెత్తగా చేసుకోవాలి.అలాగే ఒక నిమ్మకాయను కట్ చేసి, దానిలో పావు వంతు రసం తీసి ఉంచండి. దీని తరువాత, మిక్సర్ జార్లో దోసకాయ ముక్కలు, పచ్చి కొత్తిమీర ఇంకా అలాగే పుదీనా వేయండి.ఆ తరువాత తరిగిన అల్లం, మొత్తం నిమ్మకాయ ముక్కలను ఆ మిక్సర్ జార్‌లో వేసుకోవాలి.ఇక దీని తర్వాత దానికి 2 కప్పుల నీళ్లు పోసి గ్రైండ్ చేసి  జ్యూస్‌గా చేసుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ గ్లాస్‌లో దాన్ని వడకట్టాలి. ఇప్పుడు మీ ఆరోగ్యకరమైన దోసకాయ రసం రెడీ అవుతుంది. ఇక రుచి కోసం మీరు ఇందులో  తేనె నల్ల ఉప్పు కలుపుకుని తాగేయొచ్చు. ఈ రసం ప్రతి రోజూ తాగడం వల్ల ఖచ్చితంగా హైబిపి సమస్యతో పాటు అన్ని సమస్యలు కూడా ఈజీగా తగ్గుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: