ప్లాస్టిక్ బాటిల్ లో నీళ్లు తాగితే ఈ ప్రమాదం తప్పదు?

Purushottham Vinay
ప్లాస్టిక్  బాటిల్ లో నీళ్లు తాగడం మానవుల ఆరోగ్యానికి చాలా హానికరం. ముఖ్యంగా ఆఫీసుకు లేదా వర్కవుట్‌కి , బయటకు వెళ్లే సమయంలోనే కాదు.. ఇప్పుడు ఇంట్లో కూడా నీరు తాగాలంటే.. ప్లాస్టిక్ బాటిల్స్ ను ఆశ్రయిస్తున్నారు. ఇక ప్లాస్టిక్‌ గ్లాసుల వినియోగం కూడా అధికంగానే ఉంది. అయితే ఇలా ప్లాస్టిక్ బాటిల్స్ లో వాటర్ తాగడంపై ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్ ఒక పాలిమర్. ప్లాస్టిక్‌లో కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, క్లోరైడ్ ఉంటాయి. అంతేకాదు ప్లాస్టిక్‌లో బీపీ అనే రసాయనం ఉంటుంది, ఇది మన శరీరానికి చాలా ప్రాణాంతకం. వైద్యుల ప్రకారం, రసాయనాలు, పాలిమర్లలో ఉండే మూలకాలు మన శరీరంలోకి వెళితే, అది అనేక వ్యాధులకు దారి తీస్తుంది.ప్రభుత్వ లెక్కల ప్రకారం, భారతదేశం ప్రతి సంవత్సరం దాదాపు 3.5 మిలియన్ టన్నుల ప్లాస్టిక్‌ను ఉత్పత్తి చేస్తోంది. వచ్చే ఐదేళ్లలో తలసరి పరంగా రెట్టింపు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఒక నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 480 బిలియన్ ప్లాస్టిక్ సీసాలు అమ్ముడయ్యాయి.మన ఇళ్లలో ప్రజలు ప్లాస్టిక్ బాటిళ్లలో ఉంచిన నీటిని మాత్రమే ఉపయోగించడానికి అలవాటు పడ్డారు. ప్రజలు ప్లాస్టిక్ బాటిళ్లను చాలా రోజుల తరబడి ఫ్రిజ్‌లో ఉంచుతారు.


ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్‌లో ఉన్న DPA, ఇతర రసాయనాలు నీటిలో కలిసి.. అవి మన శరీరానికి చేరే అవకాశం ఉంది. కనుక తాగే నీటిని రాగి పాత్రల్లో లేదా గాజు బాటిల్స్ లో నిల్వ చేసుకోవడం మంచిది. అదే వేసవి కాలం ఐహితే మట్టి కుండలు ఉత్తమం. పురాతన కాలంలో కూడా ప్రజలు రాగి పాత్రలను మాత్రమే ఉపయోగించారు. వైద్యుల అభిప్రాయం ప్రకారం, రాగి శరీరానికి చాలా పోషకమైన మూలకం. ప్రజలు రాగి పాత్రలో నీరు తాగాలి.ప్లాస్టిక్ బాటిల్ లో నీటిని ఎక్కువ సేపు నిల్వ ఉంచడం మంచికాదని నిపుణులు చెబుతున్నారు. అలా నిల్వ ఉన్న నీటిని తాగితే.. తీవ్రమైన వ్యాధులు రావచ్చంటూ హెచ్చరిస్తున్నారు. అంతేకాదు పురుషులలో హార్మోన్ల సమతుల్యత ఏర్పడుతుంది. స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. కాలేయానికి తీవ్రమైన నష్టం కూడా సంభవించవచ్చు. అంతే కాదు మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. ఈ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించడం చాలా అవసరమని సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: